Italy Road Accident: ఇటలీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy Road Accident: ఇటలీలో నలుగురు భారతీయులు మృతి చెందారు. దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారని రోమ్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. మృతులు మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, వారి కారు ట్రక్కును ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
READ ALSO: Vijay Deverakonda: మొన్ననే ఎంగేజ్మెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ..!
Also Read
- Anjanadri Temple: హనుమ జన్మస్థలంలోనే ఇంత మోసమా? అంజన్నకు నకిలీ ఆభరణాల విరాళం!
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు..
పలు నివేదికల ప్రకారం.. గత శనివారం స్కాన్జానో జోనికో ప్రాంతంలో 10 మందితో ప్రయాణిస్తున్న ఏడు సీట్ల కారు ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 ఉండగా, అక్కడికక్కడే నలుగురు భారతీయులు మృతి చెందారు, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుమార్ మనోజ్ (34), సింగ్ సుర్జీత్ (33), సింగ్ హర్విందర్ (31), సింగ్ జస్కరన్ (20) గా గుర్తించారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది.
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను తెలుసుకోడానికి స్థానిక ఇటాలియన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు, సంబంధిత కుటుంబాలకు రాయబార కార్యాలయం అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తుందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. గాయపడిన వారిలో ఐదుగురిని పోలికోరో (మటేరా)లోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఆరవ వ్యక్తిని పోటెంజాలోని శాన్ కార్లో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఇద్దరు మరణించారు..
గతంలో ఇటలీలోని గ్రోసెటో సమీపంలోని ఆరేలియా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగ్పూర్ వ్యాపారవేత్త, ఆయన భార్య మరణించారు. ప్రమాదంలో వారి పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను నాగ్పూర్కు చెందిన ప్రసిద్ధ హోటల్ వ్యాపారి జావేద్ అక్తర్, ఆయన భార్య నాదిరా గుల్షన్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారి కుమార్తె అర్జూ అక్తర్, మరో కుమార్తె షిఫా, కుమారుడు జాజెల్లను ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Anjanadri Temple: హనుమ జన్మస్థలంలోనే ఇంత మోసమా? అంజన్నకు నకిలీ ఆభరణాల విరాళం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!