Israel Hamas War : ఇజ్రాయెల్లో తుపాకీలకు పెరిగిన డిమాండ్… 42వేల మంది మహిళలు దరఖాస్తు
- ఇజ్రాయెల్లో భయాందోళనలో మహిళలు
- తుపాకులకు పెరిగిన డిమాండ్
- తుపాకీలు కావాలని 42వేల దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు 8 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. రెండు దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది మరణించగా, లక్షలాది మంది గాయపడ్డారు. హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్లో ఆయుధాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇజ్రాయెల్ మహిళలు కూడా శత్రువుల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. అందరిలో తుపాకీకి డిమాండ్ ఉంది. ఇజ్రాయెల్ మహిళలు తుపాకులు ఉపయోగించడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, హమాస్ దాడి తర్వాత 42,000 మంది ఇజ్రాయెల్ మహిళలు తుపాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 18వేలు మంజూరయ్యాయి. ఈ సంఖ్య గతంలో కంటే చాలా ఎక్కువ. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు మహిళలకు ఉన్న లైసెన్స్ల సంఖ్య కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.
Read Also:Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మహిళలు మరింత ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు. తనను తాను సురక్షితంగా భావించడం లేదు కాబట్టి రక్షించుకోవడానికి తుపాకీని కొనుగోలు చేస్తోందని.. భద్రతా మంత్రిత్వ శాఖ డేటా పేర్కొ్ంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో 15,000 మంది మహిళలు తుపాకీలను కలిగి ఉన్నారు. 10 వేల మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్లో దాదాపు 1200 మంది చనిపోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలు కూడా బందీలుగా ఉన్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ కూడా హమాస్పై ప్రతీకారం తీర్చుకుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్ నిర్వహించింది. హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటివరకు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 37,000 మందికి పైగా మరణించారు, గాయపడిన వారి సంఖ్య చాలా ఎక్కువ. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
Read Also:Devara : దేవర కోసం రంగంలోకి దిగిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్..
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!