Israel Hamas War : ఇజ్రాయెల్లో తుపాకీలకు పెరిగిన డిమాండ్… 42వేల మంది మహిళలు దరఖాస్తు
- ఇజ్రాయెల్లో భయాందోళనలో మహిళలు
- తుపాకులకు పెరిగిన డిమాండ్
- తుపాకీలు కావాలని 42వేల దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు 8 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. రెండు దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది మరణించగా, లక్షలాది మంది గాయపడ్డారు. హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్లో ఆయుధాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇజ్రాయెల్ మహిళలు కూడా శత్రువుల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. అందరిలో తుపాకీకి డిమాండ్ ఉంది. ఇజ్రాయెల్ మహిళలు తుపాకులు ఉపయోగించడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, హమాస్ దాడి తర్వాత 42,000 మంది ఇజ్రాయెల్ మహిళలు తుపాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 18వేలు మంజూరయ్యాయి. ఈ సంఖ్య గతంలో కంటే చాలా ఎక్కువ. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు మహిళలకు ఉన్న లైసెన్స్ల సంఖ్య కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.
Read Also:Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్లతో ఎక్స్లో పోస్టులు!
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మహిళలు మరింత ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు. తనను తాను సురక్షితంగా భావించడం లేదు కాబట్టి రక్షించుకోవడానికి తుపాకీని కొనుగోలు చేస్తోందని.. భద్రతా మంత్రిత్వ శాఖ డేటా పేర్కొ్ంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో 15,000 మంది మహిళలు తుపాకీలను కలిగి ఉన్నారు. 10 వేల మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసింది. హమాస్ దాడిలో ఇజ్రాయెల్లో దాదాపు 1200 మంది చనిపోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలు కూడా బందీలుగా ఉన్నారు. దీని తర్వాత ఇజ్రాయెల్ కూడా హమాస్పై ప్రతీకారం తీర్చుకుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్ నిర్వహించింది. హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటివరకు, ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 37,000 మందికి పైగా మరణించారు, గాయపడిన వారి సంఖ్య చాలా ఎక్కువ. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు.
Read Also:Devara : దేవర కోసం రంగంలోకి దిగిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్..
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?