Iran US Israel War: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై 35 రోజులు గడిచాయి. ఈ ఘర్షణ సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. కాల్పుల విరమణ విఫలమవ్వడంతో ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలను, గల్ఫ్ మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తోంది. అయితే.. ఇరాన్ అణు ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ జవాద్ జరీఫ్ (Mohammad Javad Zarif)తాజాగా అమెరికాకు చెందిన ‘ఫారిన్ అఫైర్స్’ (Foreign Affairs) పత్రికలో రాసిన వ్యాసంలో ఇరాన్ ముందు ఒక సరికొత్త వ్యూహాన్ని ఉంచారు. ట్రంప్ను ట్రంప్ తరహాలోనే ఎదుర్కోవాలనే సూచన ఇచ్చారు. ట్రంప్ విసిరిన యుద్ధ వ్యూహాన్ని ఆయన శైలిలోనే తిప్పికొట్టాలని జరీఫ్ సూచించారు.
READ MORE: Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
“ఈ యుద్ధంతో అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ లక్ష్యాలు నెరవేరలేదు. ఇరాన్ తన సత్త చాటుతూనే ఉంది. ఇక ఇరాన్ స్వయంగా యుద్ధంలో గెలిచినట్లు ప్రకటించుకోవాలి. అంటే ఇరాన్ స్వయంగా తామే విజేతగా స్పష్టం చేయాలి. ట్రంప్ కాల్పుల విరమణ కోసం ఎదురుచూడకుండా, ఇరాన్ వైపు నుంచే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని యుద్ధాన్ని ముగించాలి. ఒకవేళ ఇరాన్ స్వయంగా శాంతిని ప్రకటిస్తే, అది ట్రంప్ను రక్షణలో పడేస్తుంది. అంతర్జాతీయంగా ఇరాన్కు సానుభూతితో పాటు మద్దతు లభిస్తుంది.” అని మహ్మద్ జవాద్ జరీఫ్ (Mohammad Javad Zarif) పేర్కొన్నారు.
READ MORE: Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!
ఇదిలా ఉండగా.. యుద్ధం మొదలయ్యే ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధం 4 లేదా 6 వారాల్లో ముగుస్తుందని అంచనా వేశారు. కానీ.. ఇప్పటికీ ఘర్షణలు సర్దుమణగడం లేదు. దీంతో ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జనాలు తిరుగుబాటు ప్రారంభించారు. ఈ తరుణంలో ట్రంప్ ఇటీవల ఆసక్తికర ప్రకటన చేశారు. యుద్ధం మరో 2-3 వారాల్లో ముగియవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణ కోరారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది. ఈ దాడులు ఎప్పుడు ముగుస్తాయే చూడాలి.
