Iran War: ఇరాన్కు రూ.18 కోట్లు చెల్లించి.. హర్మూజ్ జలసంధిని దాటిన చమురు నౌక..
- రూ.18 కోట్లు వసూలు చేసిన ఇరాన్..
- హర్మూజ్ జలసంధిని దాటిని చమురు నౌక..
- భారత్కు ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్య ప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురక్షితంగా ప్రయాణించేందుకు కనీసం ఒక నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 18 కోట్లు) వసూలు చేసినట్లు సమాచారం. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే చమురులో 20 శాతం ఈ మార్గం గుండానే వెళ్తుంది. ప్రస్తుతం ఇరాన్ ఆంక్షల వల్ల చమురు ధరలు పెరిగిపోతున్నాయి.
రంగంలోకి అమెరికా యుద్ధ నౌక..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తన తర్వాత ప్లాన్ ఏంటనేది స్పష్టం చేయడం లేదు. అయితే.. తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం 2,200 మంది సైనికులతో కూడిన ‘యూఎస్ఎస్ ట్రిపోలి’ అనే భారీ యుద్ధ నౌక మధ్య ప్రాచ్య దేశాల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది భారత సముద్ర తీరానికి సమీపంలోనే ఉంది. ఇరాన్ తీర ప్రాంతంలో తన పట్టు పెంచుకోవడానికి అమెరికా ఈ నౌకను పంపిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ ఏమన్నారంటే..?
సైన్యాన్ని పంపడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘నేను సైన్యాన్ని ఎక్కడికీ పంపడం లేదు. ఒకవేళ పంపాల్సి వచ్చినా ఆ విషయం మీకు ముందే చెప్పను కదా’ అంటూ మాట్లాడారు. కానీ, ఇరాన్ను అదుపు చేసేందుకు వేల సంఖ్యలో సైనికులను పంపే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది.
భారత్కు ఊరట..
పశ్చిమ దేశాల నౌకలపై ఇరాన్ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. భారత్ , పాకిస్థాన్లకు వెళ్లే చమురు నౌకలను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇరాన్ తీరంలోని కొన్ని కీలకమైన ద్వీపాలను తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అమెరికా భావిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో అమెరికా తీసుకునే నిర్ణయాలపైనే ఈ యుద్ధం ఎటుపోతుంది అనేది ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!