Iran Vs USA: 50 రోజుల తర్వాత గగనతలాన్ని తెరిచిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Vs USA: సుమారు ఏడు వారాల సుదీర్ఘ విరామం తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని పాక్షికంగా పునఃప్రారంభించింది. తూర్పు ఇరాన్ మీదుగా అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆ దేశ పౌర విమానయాన సంస్థ తాజాగా ప్రకటించింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి కొన్ని విమానాశ్రయాలను కూడా తెరిచారు. ఇరాన్ తన గగనతలాన్ని తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు మాత్రం అటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ల డేటా ప్రకారం.. ఇరాన్ మీదుగా చెప్పుకోదగిన స్థాయిలో విమానాల రాకపోకలు కనిపించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఏయిర్ లైన్స్ సంస్థలు ఇప్పటికీ సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాలనే ఎంచుకుంటున్నాయి.
READ ALSO: Punarvika: పునర్వికకు పునర్జన్మ.. నేడే మంత్రి లోకేష్ సమక్షంలో రూ. 16 కోట్ల ఇంజెక్షన్..
Also Read
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
హోర్ముజ్ జలసంధిపై ఉత్కంఠ..
మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ మార్గంలో ఇంకా అస్థిరత కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ మాత్రం హోర్ముజ్ జలసంధిపై తన పట్టును సడలించడం లేదు. కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఈ మార్గాన్ని తెరిచామని, శత్రు దేశాల సైనిక నౌకలకు అనుమతి లేదని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికాతో మరో విడత శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తెగేసి చెప్పింది. పాకిస్థానీ మధ్యవర్తి ద్వారా ఈ నిర్ణయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇరాన్ ప్రజలు గత 50 రోజులుగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. నెట్బ్లాక్స్ నివేదిక ప్రకారం.. దేశంలో దాదాపు ఏడు వారాలుగా డిజిటల్ బ్లాక్అవుట్ అమల్లో ఉంది. ఇంటర్నెట్ నిలిపివేసి 1,176 గంటలు దాటిపోవడంతో వ్యాపారాలు, సమాచార మార్పిడి, ప్రజల దైనందిన జీవితం పూర్తిగా స్తంభించిపోయింది.
తాజావార్తలు
-
MLA Jagan: ‘బెంగళూరును ఏలుతున్నాం’ వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
-
AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!