NTV Telugu Site icon

Iran Israel War: మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి.. 18 మంది మృతి

Iran Israel War

Iran Israel War

Iran Israel War: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు చేసింది. అందిన సమాచారం మేరకు., ఆదివారం తెల్లవారుజామున గాజా మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ దాడి జరిగింది. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేయబోతున్న సమయంలో సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాహ్‌లోని అల్-అక్సా హాస్పిటల్ సమీపంలో ఉన్న మసీదుపై దాడి జరిగింది. ఘటన సమయంలో మసీదులో చాలామంది ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Also Read: Acid Attack: 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్.. మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు

ఇజ్రాయెల్‌తో యుద్ధానికి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాలస్తీనా భూభాగాల్లో ప్రజలు గుమిగూడుతుండగా ఈ దాడి జరిగింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తదుపరి సైనిక దాడిలో ఇప్పటివరకు దాదాపు 42,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.

Also Read: Sabarimala: వారికి మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనం.. రోజుకు 80వేల మందికే దర్శనం