MS Dhoni: ఐపీఎల్ హిస్టరీలో ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత.. ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు!
- ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత
- 150వ క్యాచ్ను అందుకున్న మొదటి వికెట్ కీపర్గా రికార్డు
- మహీ రికార్డు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 150వ క్యాచ్ను అందుకున్న మొదటి వికెట్ కీపర్గా ధోనీ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో నేహల్ వధేరా క్యాచ్ను అందుకోవడంతో మహీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ప్రస్తుతం ఐపీఎల్లో ఈ రికార్డుకు చేరువలో మరెవరూ కూడా లేరు.
మొత్తంగా 43 ఏళ్ల ఎంఎస్ ధోనీ ఐపీఎల్లో 154 క్యాచ్లు అందుకున్నాడు. అందులో నాలుగు క్యాచ్లు ఫీల్డర్గా అందుకోగా.. 150 క్యాచ్లు కీపర్గా పట్టుకున్నాడు. ఈ జాబితాలో మహీ తర్వాతి స్ధానంలో మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (137) ఉన్నాడు. వృద్దిమాన్ సాహా (87), రిషబ్ పంత్ (76), క్వింటన్ డికాక్ (66) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీకి దరిదాపుల్లో ఉన్న దినేష్ కార్తీక్ ఇప్పటికే రిటైర్ అయ్యాడు కాబట్టి.. మహీ రికార్డు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు.
Also Read
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
Also Read: Mujra Party: మొయినాబాద్లో ముజ్రా పార్టీ భగ్నం.. ఏడుగురు అమ్మాయిలతో..!
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. ప్రియాంశ్ ఆర్య (103; 42 బంతుల్లో 7×4, 9×6) మెరుపు సెంచరీ చేయగా.. శశాంక్ సింగ్ (52 నాటౌట్; 36 బంతుల్లో 2×4, 3×6) అర్ధ సెంచరీ బాదాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (2/45), ఆర్ అశ్విన్ (2/48) ఆకట్టుకున్నారు. ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 201 రన్స్ చేసి ఓడింది. డెవాన్ కాన్వే (69; 49 బంతుల్లో 6×4, 2×6), రచిన్ రవీంద్ర (36; 23 బంతుల్లో 6×4) రాణించారు. ఎంఎస్ ధోనీ (27; 12 బంతుల్లో 4×4, 3×6) ఆకట్టుకున్నాడు.
తాజావార్తలు
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!