Mohammed Siraj: మనస్థాపానికి గురయ్యా.. జీర్ణించుకోలేకపోయా.. కష్టపడ్డా: సిరాజ్
- ఐపీఎల్ 2025లో అదరగొడుతున్న మహ్మద్ సిరాజ్
- ఉప్పల్ మైదానంలో నాలుగు వికెట్ల ప్రదర్శన
- సొంత మైదానంలో ఆటడం చాలా స్పెషల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. నిలకడగా రాణించలేదు. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున కూడా పెద్దగా రాణించిన దాఖలు లేవు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్ను బెంగళూరు వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టుకు ఎంపిక కాని ఈ హైదరాబాద్ పేసర్.. ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం రాకపోవడం, ప్రస్తుత ప్రదర్శనపై స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేనందుకు మనస్థాపానికి గురయ్యా అని, ఒక దశలో ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయా అని, ఆపై తీవ్రంగా కష్టపడ్డాను అని తెలిపాడు. ‘ఉప్పల్ మైదానంలో చాలా మ్యాచ్లు ఆడాను. సొంత మైదానంలో ఆటడం చాలా స్పెషల్. ఆ అనుభూతి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేక్షకుల్లో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్లు సంతోషంగా ఉంటారు. ఏడేళ్ల పాటు బెంగళూరుకు ఆడాను, ఇప్పుడు గుజరాత్కు ఆడుతున్నా. నా బౌలింగ్పై తీవ్రంగా శ్రమించా. అది నాకు చాలా మేలు చేసింది’ అని సిరాజ్ చెప్పాడు.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
Also Read: MS Dhoni: ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది: ధోనీ
‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఎంపిక కాలేనందుకు మనస్థాపానికి గురయ్యా. ఒక దశలో ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయా. దానిని దృష్టిలో పెట్టుకుని చాలా కష్టపడ్డాను. గతంలో నేను ఏం తప్పులు చేశానో తెలుసుకుని సరిదిద్దుకున్నా. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. నా బౌలింగ్ను ఆస్వాదిస్తున్నా. భారత జట్టులో ఛాన్స్ రాకపోయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నా. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో ఆడేందుకు సిద్ధమయ్యాను. అనుకున్నవిధంగా మైదానంలో ఆట తీరును అమలు చేస్తే.. వికెట్లు అవే వస్తాయి. వికెట్కు ఇరు వైపులా స్వింగ్ చేస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది’ అని మహ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!