IPL 2025-MI: ముంబై జట్టులో భారీ మార్పులు ఖాయం.. హార్దిక్, రోహిత్ సహా..: ఆకాశ్
- ఐపీఎల్ 2025 మెగా వేలం
- ముంబై జట్టులోకి మహేల
- ఆరుగురు ఆటగాళ్లని రిటైన్ చేసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్థానంలో మహేల జయవర్థనే వచ్చాడు. ఐపీఎల్ 2024లో బౌచర్ కోచ్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మని కెప్టెన్గా తొలగించి.. హార్దిక్ పాండ్యాని నియమించిన విషయం తెలిసిందే. హార్దిక్ ఫామ్లో లేకపోవడం, జట్టులో సమన్వయ లోపంతో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానాని పరిమితమైంది. గత కొద్దిరోజులుగా రోహిత్ జట్టుని వీడతాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. ముంబై ప్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపాడు. కీలక ప్లేయర్లను అతిపెట్టుకోవడానికి రూ.79 కోట్లు వెచ్చించినా.. ముంబై ఫ్రాంచైజీకి ఎలాంటి నష్టం లేదన్నాడు.
‘మహేల జయవర్దనే తిరిగి ముంబై జట్టులోకి వచ్చాడు. దీంతో జట్టులో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్దిక్ పాండ్యా ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి ఐదుగురు కీలక ఆటగాళ్లని రిటైన్ చేసుకొని ఒకరిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకునేందుకు ముంబై చూస్తుంది. హార్దిక్ సహా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్ని రిటైన్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అన్క్యాప్డ్ ప్లేయర్గా నెహాల్ వధేరాని తీసుకోవాలని భావిస్తోంది. వీరికి రూ.79 కోట్లు వెచ్చించి.. మిగతా మొత్తంతో వేలానికి వెళ్తుందని అనుకుంటా’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Also Read: Sanju Samson: టీమిండియాలో మళ్లీ అవకాశం వస్తుందని ఊహించలేదు: శాంసన్
‘మహేల జయవర్థనే గొప్ప ఆటగాడు. బ్యాటర్, కెప్టెన్గా శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించాడు. అతడికి ముంబైతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రేని నియమించడం మంచి విషయం. గత సీజన్లో జట్టు బౌలింగ్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ముంబైకి బౌలింగ్ కోచ్ అవసరం. అందుకే పరాస్ను తీసుకుంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 వేలం నవంబర్ చివరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. రిటైన్ జాబితాను సమర్పించేందుకు ఈ నెల ఆఖరి గడువు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!