IPL 2025-MI: ముంబై జట్టులో భారీ మార్పులు ఖాయం.. హార్దిక్, రోహిత్ సహా..: ఆకాశ్
- ఐపీఎల్ 2025 మెగా వేలం
- ముంబై జట్టులోకి మహేల
- ఆరుగురు ఆటగాళ్లని రిటైన్ చేసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్థానంలో మహేల జయవర్థనే వచ్చాడు. ఐపీఎల్ 2024లో బౌచర్ కోచ్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మని కెప్టెన్గా తొలగించి.. హార్దిక్ పాండ్యాని నియమించిన విషయం తెలిసిందే. హార్దిక్ ఫామ్లో లేకపోవడం, జట్టులో సమన్వయ లోపంతో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానాని పరిమితమైంది. గత కొద్దిరోజులుగా రోహిత్ జట్టుని వీడతాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. ముంబై ప్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపాడు. కీలక ప్లేయర్లను అతిపెట్టుకోవడానికి రూ.79 కోట్లు వెచ్చించినా.. ముంబై ఫ్రాంచైజీకి ఎలాంటి నష్టం లేదన్నాడు.
‘మహేల జయవర్దనే తిరిగి ముంబై జట్టులోకి వచ్చాడు. దీంతో జట్టులో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్దిక్ పాండ్యా ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి ఐదుగురు కీలక ఆటగాళ్లని రిటైన్ చేసుకొని ఒకరిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకునేందుకు ముంబై చూస్తుంది. హార్దిక్ సహా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్ని రిటైన్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అన్క్యాప్డ్ ప్లేయర్గా నెహాల్ వధేరాని తీసుకోవాలని భావిస్తోంది. వీరికి రూ.79 కోట్లు వెచ్చించి.. మిగతా మొత్తంతో వేలానికి వెళ్తుందని అనుకుంటా’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Also Read: Sanju Samson: టీమిండియాలో మళ్లీ అవకాశం వస్తుందని ఊహించలేదు: శాంసన్
‘మహేల జయవర్థనే గొప్ప ఆటగాడు. బ్యాటర్, కెప్టెన్గా శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించాడు. అతడికి ముంబైతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రేని నియమించడం మంచి విషయం. గత సీజన్లో జట్టు బౌలింగ్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ముంబైకి బౌలింగ్ కోచ్ అవసరం. అందుకే పరాస్ను తీసుకుంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 వేలం నవంబర్ చివరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. రిటైన్ జాబితాను సమర్పించేందుకు ఈ నెల ఆఖరి గడువు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!