IPL 2025 Auction: సన్రైజర్స్ హైదరాబాద్కు కష్టమే.. ఈసారి నిరాశ తప్పదు: ఆకాశ్
- పది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం
- ఆటగాళ్లను దక్కించుకొనేందుకు సిద్ధంగా ఫ్రాంచైజీలు
- సన్రైజర్స్ వద్ద రూ.45 కోట్లు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. మూడేళ్ల పాటు ఆటగాళ్లను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏ ప్లేయర్ ఎంత మొత్తం దక్కించుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్తియ ముగియగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ప్రస్తుతం సన్రైజర్స్ వద్ద రూ.45 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సొమ్ముతో నాణ్యమైన భారత క్రికెటర్లను దక్కించుకోవడం సన్రైజర్స్కు చాలా కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈసారి ఓవర్సీస్ ప్లేయర్లకు నిరాశ తప్పదన్నాడు.
ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘రిటెన్షన్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్ (23 18 కోట్లు), పాట్ కమిన్స్ (18 కోట్లు), ట్రావిస్ హెడ్ (14 కోట్లు) కోసం భారీగా వెచ్చించింది. ఈ ముగ్గురు ప్రతి మ్యాచ్ తుది జట్టులో ఉంటారు. అభిషేక్ శర్మ, నీతిశ్ కుమార్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసింది. తుది జట్టులో భారత్ నుంచి మరో ఆరుగురు క్రికెటర్లు ఉండాలి. వారిని సొంతం చేసుకోవాలంటే సన్రైజర్స్ వద్ద ఉన్న మిగిలిన డబ్బు సరిపోదు. తుది జట్టులో నలుగురు కంటే ఎక్కువ మంది విదేశీ ప్లేయర్లు ఉండలేరు. బ్యాకప్గానూ కొందరిని తీసుకోవాలి’ అని అన్నాడు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
Also Read: Realme GT 7 Pro Launch: ‘రియల్మీ జీటీ 7 ప్రో’ వచ్చేసింది.. సూపర్ కెమెరా, జంబో బ్యాటరీ!
‘రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి స్టార్లు వేలంలో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ కూడా మంచి ప్లేయర్స్. వీరందరూ భారీ ధర పలుకుతారు. వీరిని సన్రైజర్స్ తీసుకునే అవకాశం లేదు. మంచి బౌలర్లు జట్టుకు అవసరం. మరి సన్రైజర్స్ ఎవరిని తీసుకుంటుందో చూడాలి. ముంబై రిటైన్షన్లో భారత క్రికెటర్లనే తీసుకుంది. విదేశీ క్రికెటర్లను తీసుకొవాల్సిన అవసరం ఉంది. ఫ్రాంచైజీల వద్ద ఎక్కువ డబ్బు లేకపోవడంతో ఈసారి ఓవర్సీస్ ప్లేయర్లకు నిరాశ తప్పదు. భారత క్రికెటర్లకే మెరుగైన ధర వస్తుందనుకుంటున్నా. రాబోయే మెగా వేలం ప్రాంచైజీలకు అత్యంత సంక్లిష్టం. పంజాబ్ వద్ద భారీగా డబ్బు ఉన్నా.. తీసుకోవాల్సిన ప్లేయర్ల సంఖ్య భారీగానే ఉంది. టాప్ ప్లేయర్ల కోసం పంజాబ్ చూస్తోంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకోచ్చాడు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!