IPL 2024: సీఎస్కేకు గుడ్‌న్యూస్‌.. జట్టులోకి కీలక ప్లేయర్!

Matheesha Pathirana

Matheesha Pathirana

IPL 2024: ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు గుడ్‌న్యూస్ వచ్చింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన యంగ్ పేసర్‌ మతీశా పతిరణ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని పతిరణ మేనేజర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. అయితే పతిరణకు లంక బోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే అతడు సీఎస్కే జట్టులో చేరనున్నాడు. దీంతో ఒకట్రెండు మ్యాచ్‌లకు పతిరణ దూరమయ్యే అవకాశం ఉంది.

×
×
Ad

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024 మహా సంగ్రామం నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తోందనని క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో ధోని ఎలా బ్యాటింగ్ చేస్తారో, హెలికాప్టర్‌ షాట్ల గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా సీఎస్కే హాట్‌ ఫేవరేట్‌గా నేడు బరిలోకి దిగనుంది.