Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నైని ధోనీ నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది.
మంగళవారం ఐపీఎల్ 2024కు సంబందించిన వేలం ముగిసిన అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం మేం గత పదేళ్లుగా అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది ఓ పెద్ద చర్చగా మారుతోంది. అయితే ధోనీని గత కొంతకాలంగా నేను చూస్తున్నా. మహీలో ఉత్సాహం, ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేం అలాగే కొనసాగుతాం’ అని చెప్పాడు. ఐపీఎల్ 2024కు ధోనీ నాయకత్వం వహించినా.. 2025కి అతడు రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
Also Read: Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
వేలంలో డారిల్ మిచెల్ను భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేయడంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘డారిల్ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన బాగుంది. తీవ్ర ఒత్తిడిలోనూ బాగా ఆడగలడు. స్పిన్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాడు. అంతేకాదు బౌలర్గానూ ఉపయోగపడతాడు. చెపాక్లో డారిల్ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది’ అని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డారిల్ మిచెల్ను 14 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), రచిన్ రవీంద్ర (1.80 కోట్లు), సమీర్ రిజ్వీ (8.40 కోట్లు), ముస్తిఫిజుర్ రెహమాన్ (2 కోట్లు), అరవెల్లి అవనీష్ (2 కోట్లు)లను చెన్నై కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!