Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నైని ధోనీ నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది.
మంగళవారం ఐపీఎల్ 2024కు సంబందించిన వేలం ముగిసిన అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం మేం గత పదేళ్లుగా అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది ఓ పెద్ద చర్చగా మారుతోంది. అయితే ధోనీని గత కొంతకాలంగా నేను చూస్తున్నా. మహీలో ఉత్సాహం, ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేం అలాగే కొనసాగుతాం’ అని చెప్పాడు. ఐపీఎల్ 2024కు ధోనీ నాయకత్వం వహించినా.. 2025కి అతడు రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
Also Read: Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
వేలంలో డారిల్ మిచెల్ను భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేయడంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘డారిల్ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన బాగుంది. తీవ్ర ఒత్తిడిలోనూ బాగా ఆడగలడు. స్పిన్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాడు. అంతేకాదు బౌలర్గానూ ఉపయోగపడతాడు. చెపాక్లో డారిల్ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది’ అని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డారిల్ మిచెల్ను 14 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), రచిన్ రవీంద్ర (1.80 కోట్లు), సమీర్ రిజ్వీ (8.40 కోట్లు), ముస్తిఫిజుర్ రెహమాన్ (2 కోట్లు), అరవెల్లి అవనీష్ (2 కోట్లు)లను చెన్నై కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!