Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నైని ధోనీ నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది.
మంగళవారం ఐపీఎల్ 2024కు సంబందించిన వేలం ముగిసిన అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం మేం గత పదేళ్లుగా అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది ఓ పెద్ద చర్చగా మారుతోంది. అయితే ధోనీని గత కొంతకాలంగా నేను చూస్తున్నా. మహీలో ఉత్సాహం, ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేం అలాగే కొనసాగుతాం’ అని చెప్పాడు. ఐపీఎల్ 2024కు ధోనీ నాయకత్వం వహించినా.. 2025కి అతడు రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Also Read: Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
వేలంలో డారిల్ మిచెల్ను భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేయడంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘డారిల్ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన బాగుంది. తీవ్ర ఒత్తిడిలోనూ బాగా ఆడగలడు. స్పిన్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాడు. అంతేకాదు బౌలర్గానూ ఉపయోగపడతాడు. చెపాక్లో డారిల్ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది’ అని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డారిల్ మిచెల్ను 14 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), రచిన్ రవీంద్ర (1.80 కోట్లు), సమీర్ రిజ్వీ (8.40 కోట్లు), ముస్తిఫిజుర్ రెహమాన్ (2 కోట్లు), అరవెల్లి అవనీష్ (2 కోట్లు)లను చెన్నై కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!