Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నైని ధోనీ నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది.
మంగళవారం ఐపీఎల్ 2024కు సంబందించిన వేలం ముగిసిన అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం మేం గత పదేళ్లుగా అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది ఓ పెద్ద చర్చగా మారుతోంది. అయితే ధోనీని గత కొంతకాలంగా నేను చూస్తున్నా. మహీలో ఉత్సాహం, ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేం అలాగే కొనసాగుతాం’ అని చెప్పాడు. ఐపీఎల్ 2024కు ధోనీ నాయకత్వం వహించినా.. 2025కి అతడు రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
Also Read: Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
వేలంలో డారిల్ మిచెల్ను భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేయడంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘డారిల్ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన బాగుంది. తీవ్ర ఒత్తిడిలోనూ బాగా ఆడగలడు. స్పిన్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాడు. అంతేకాదు బౌలర్గానూ ఉపయోగపడతాడు. చెపాక్లో డారిల్ కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది’ అని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డారిల్ మిచెల్ను 14 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), రచిన్ రవీంద్ర (1.80 కోట్లు), సమీర్ రిజ్వీ (8.40 కోట్లు), ముస్తిఫిజుర్ రెహమాన్ (2 కోట్లు), అరవెల్లి అవనీష్ (2 కోట్లు)లను చెన్నై కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!