NTV Telugu Site icon

AP High Court: ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్

Ap High Court

Ap High Court

AP High Court: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ ఘటనపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2020లో ఘటన జరిగినపుడు 15 మంది మృతి చెందారు.

Read Also: YSRCP Samajika Sadhikara Yatra: గత పాలకులకు, నేటి జగన్ పాలనకు తేడా గుర్తించాలి..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పెను ప్రమాదాల్లో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఒకటి.. వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషవాయువు ధాటికి ఊపిరి అందక జనాలు రోడ్లపైనే కుప్పకూలిపోయారు. కళ్లెదుటే తమ వారిని బంధువులు కోల్పోయారు. ఈ ఘటన అందరినీ కలచి వేసింది. కళ్లారా చూస్తుండగానే ఊపరి అందకా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అంతా కుప్ప కూలారు. అయితే ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన ప్రభుత్వం భారీగా నష్ట పరిహారం ప్రకటించింది. . విషవాయువు లీకై గ్రామానికి చెందిన 12 మంది ప్రమాదం జరిగిన రోజున మృతిచెందగా, మరో ముగ్గురు మరికొన్ని రోజుల తర్వాత మృతి చెందారు.