RBI MPC Meeting: ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆర్బీఐ సత్వర చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI MPC Meeting: ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 6 నుండి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 8న ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తారు. ఇందులో ఆర్బిఐ పాలసీ రేట్ల రెపో రేటుకు సంబంధించిన వైఖరి కూడా ఉంటుంది. ఈ సమావేశంలో పాలసీ రేట్లలో మార్పు వచ్చే అవకాశం లేదు. ఈ పాలసీ సమావేశానికి ముందు నవంబర్ 13న గణాంకాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం రేటును ప్రకటించింది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి 5 శాతానికి దిగువన 4.87 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం రేటును మరింత తగ్గించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో ద్రవ్యోల్బణం రేటు 5.4 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.6 శాతంగా నాల్గవ త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంటుందని అంచనా.
Read Also:Madhu Yashki: హయత్ నగర్ లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి ఇంట్లో పోలీసుల సోదాలు
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సరఫరా సమస్యల్లో తగ్గుదల, ఆహార ధరలు తగ్గడం, చౌకగా మారిన ఇంధనం కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. కానీ పప్పులు, గోధుమలు, బియ్యం ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రధాన ద్రవ్యోల్బణం కూడా 4.4 శాతానికి తగ్గింది. ఆహారం, ఇంధన ధరలు ప్రధాన ద్రవ్యోల్బణంలో లెక్కించబడవు. ద్రవ్యోల్బణంపై సెంట్రల్ బ్యాంక్ పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇటీవల చెప్పారు. ద్రవ్య విధానం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోందన్నారు. రబీ పంట దిగుబడి మెరుగ్గా ఉండి ముడి చమురు ధరలు ఆశించినంత స్థాయిలో ఉంటే రిటైల్ ద్రవ్యోల్బణం 2024లో దాదాపు 4 శాతానికి తగ్గవచ్చు. ఆ తర్వాత రెపో రేటులో మార్పు కనిపించవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత కొత్త సంవత్సరంలో RBI రెపో రేటును తగ్గించవచ్చు. ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గవచ్చు. మే 2022లో ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి పెరిగింది. తర్వాత జరిగిన 6వ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో RBI రెపో రేటును 4 శాతం నుండి 6.50 శాతానికి పెంచింది. రెపో రేటు 2.50 శాతం పెరిగిన తర్వాత, గృహ రుణంతో సహా అన్ని రుణాలు భారంగా మారాయి. పాత గృహ రుణ EMI ఖరీదైంది. కానీ ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత దాదాపు 4 శాతం వద్ద స్థిరంగా ఉన్నందున, కొత్త సంవత్సరంలో ఖరీదైన EMIల నుండి ఉపశమనం పొందవచ్చు.
Read Also:Atrocious: మెదక్ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన చిన్న గాయం
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!