Worm In Antibiotic Syrup: యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు.. ఆందోళనలో తల్లిదండ్రులు! అసలేం జరుగుతోంది?
Worm In Antibiotic Syrup: మధ్యప్రదేశ్లో కల్తీ దగ్గు సిరప్ కారణంగా 20 మంది పిల్లలు మరణించిన విషయం మరవక ముందే.. మరో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈసారి యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ సిరప్ (Azithromycin Oral Suspension Syrup)లో ఈ లోపం బయటపడింది. అందిన నివేదిక వివరాల ప్రకారం.. గ్వాలియర్ లోని మురార్ జిల్లా ఆసుపత్రిలో పిల్లలకు ఇచ్చిన యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు కనిపించాయి. ఈ ఘటన వెలుగులోకి రావడానికి కారణం ఒక తల్లి. తన బిడ్డకు సిరప్ ఇచ్చే ముందు సీసాను పరిశీలించిన ఆ తల్లికి, సిరప్లో ఏవో నల్లని పురుగు లాంటివి కనిపించాయి.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
మురార్ మెటర్నిటీ హోమ్ ఆసుపత్రిలో ఓ పిల్లాడికి అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ సిరప్ ను సూచించారు. డ్రగ్ పంపిణీ కేంద్రం నుంచి సిరప్ తీసుకున్న ఆ తల్లి అందులో ఉన్న పురుగును చూసి వెంటనే ఆసుపత్రికి చేరుకుని సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్కే శర్మకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై, డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుభూతి శర్మ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపింది. దర్యాప్తు బృందం ఫార్మసీ నుంచి సిరప్ నమూనాలను సేకరించడంతో పాటు, అజిత్రోమైసిన్ సిరప్ పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సిరప్ పంపిణీ అయిన కేంద్రాల నుంచి దాన్ని వెనక్కి రప్పించే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
ఎన్నో స్మార్ట్ ఫోన్స్ చూశాం కానీ.. రాబోయే HONOR Robot Phone వేరే లెవెల్ అంతే.! వీడియో వైరల్..
దర్యాప్తులో భాగంగా ఈ విభాగం ఇతర పిల్లల మందులను కూడా పరిశీలించింది. ప్రాథమిక విచారణలో ఈ సిరప్ భోపాల్ లోని ప్రభుత్వ స్టోర్ నుంచి సరఫరా అయినట్లు వెల్లడైంది. ప్రస్తుతం బ్యాచ్ నంబర్ల ఆధారంగా ఈ సిరప్ ఏయే జిల్లాలకు పంపబడిందో గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ విషయంపై డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుభూతి శర్మ మాట్లాడుతూ.. సిరప్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు ధృవీకరించారు. ల్యాబ్ నివేదికలో ఏదైనా నాణ్యతా లోపం లేదా హానికరమైన పదార్థాలు ఉన్నట్లు తేలితే.. సంబంధిత కంపెనీ లేదా సరఫరాదారుపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ సిరప్ను పంపిణీ చేయవద్దని, ఉపయోగించవద్దని ఆ ప్రాంతంలోని ఆసుపత్రులను అధికారులు ఆదేశించారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!