Flight: నిద్రలోకి జారుకున్న పైలట్లు.. ప్లైట్ మిస్సింగ్! తప్పిన ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానంలో ఇద్దరు పైలట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకేసారి ఇద్దరు నిద్ర పోవడంతో విమానం దారి తప్పింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇద్దరిపై అధికారులు వేటు వేశారు.
దాదాపు అరగంట తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ తాజాగా వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు పైలట్లపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి దేశ రాజధాని జకర్తాకు పయనమైంది. కొద్దిసేపటికి కోపైలట్ అనుమతితో ప్రధాన పైలట్ నిద్రపోయాడు. విమానాన్ని నియంత్రణలోకి తీసుకున్న కోపైలట్ సైతం కూడా కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వారిని సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రోల్ సెంటర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్న 28 నిమిషాల తర్వాత మేల్కొన్న కెప్టెన్.. సహచర పైలట్ కూడా నిద్రపోతున్నాడని.. తాము నిర్ణీత మార్గంలో వెళ్లడం లేదని గుర్తించాడు. వెంటనే అతడిని నిద్ర లేపి, కంట్రోల్ సెంటర్ కాల్స్కు స్పందించాడు. ఈ క్రమంలోనే విమానాన్ని సరైన మార్గంలో పెట్టి.. జకర్తాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
జనవరి 25న జరిగిన ఈ ఘటనను రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని, స్థానికంగా అన్ని విమాన సేవల నిర్వహణ తీరును సమీక్షిస్తామని ఇండోనేషియా రవాణా శాఖ ప్రకటించింది.
ఇటీవల పలు దేశాల్లో విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి ప్రధానంగా పైలట్ల నిర్లక్ష్యమే కారణంగా జరుగుతున్నాయని నివేదికల్లో తేలుతున్నాయి. అయినా కూడా మొద్ద నిద్ర వీడడం లేదు. తాజా ఘటన తెలిసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లుగా వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక శుక్రవారం కూడా అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే టైరు ఊడి కిందపడింది. దీంతో పార్కింగ్లో ఉన్న కారు మీద పడడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?