Flight: నిద్రలోకి జారుకున్న పైలట్లు.. ప్లైట్ మిస్సింగ్! తప్పిన ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానంలో ఇద్దరు పైలట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకేసారి ఇద్దరు నిద్ర పోవడంతో విమానం దారి తప్పింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇద్దరిపై అధికారులు వేటు వేశారు.
దాదాపు అరగంట తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ తాజాగా వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు పైలట్లపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి దేశ రాజధాని జకర్తాకు పయనమైంది. కొద్దిసేపటికి కోపైలట్ అనుమతితో ప్రధాన పైలట్ నిద్రపోయాడు. విమానాన్ని నియంత్రణలోకి తీసుకున్న కోపైలట్ సైతం కూడా కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వారిని సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రోల్ సెంటర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్న 28 నిమిషాల తర్వాత మేల్కొన్న కెప్టెన్.. సహచర పైలట్ కూడా నిద్రపోతున్నాడని.. తాము నిర్ణీత మార్గంలో వెళ్లడం లేదని గుర్తించాడు. వెంటనే అతడిని నిద్ర లేపి, కంట్రోల్ సెంటర్ కాల్స్కు స్పందించాడు. ఈ క్రమంలోనే విమానాన్ని సరైన మార్గంలో పెట్టి.. జకర్తాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
జనవరి 25న జరిగిన ఈ ఘటనను రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని, స్థానికంగా అన్ని విమాన సేవల నిర్వహణ తీరును సమీక్షిస్తామని ఇండోనేషియా రవాణా శాఖ ప్రకటించింది.
ఇటీవల పలు దేశాల్లో విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి ప్రధానంగా పైలట్ల నిర్లక్ష్యమే కారణంగా జరుగుతున్నాయని నివేదికల్లో తేలుతున్నాయి. అయినా కూడా మొద్ద నిద్ర వీడడం లేదు. తాజా ఘటన తెలిసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లుగా వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక శుక్రవారం కూడా అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే టైరు ఊడి కిందపడింది. దీంతో పార్కింగ్లో ఉన్న కారు మీద పడడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!