Moonlighting: రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moonlighting: ఇటీవల కాలంలో రెండు ఉద్యోగాలు ఒకేసారి చేస్తూ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఓ కంపెనీలో పని చేస్తూ.. మరో కంపెనీలో రహస్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలా డబుల్ జీతం తీసుకునే వారు ఎక్కువయ్యారు. దీనినే “మూన్లైటింగ్” అని అంటారు. సాధారణంగా ఇది కంపెనీ పాలసీలను ఉల్లంఘించడం.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది తీవ్ర నేరం. “మూన్లైటింగ్” తాజాగా అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తిని పెద్ద ప్రమాదంలోకి నెట్టాయి.
READ MORE: EAM Jaishankar: ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై జైశంకర్ అసంతృప్తి
Also Read
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
అమెరికా న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ వ్యవస్థలో కీలకమైన ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గోస్వామి 2022 నుంచే మాల్టాలోని ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ గ్లోబల్ ఫౌండ్రీస్లో రహస్యంగా కాంట్రాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు చోట్ల ఒకేసారి పని చేస్తూ, తన ప్రభుత్వ డ్యూటీ సమయాన్ని కూడా ప్రైవేట్ కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.
READ MORE: Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
అధికారులు గోస్వామి రెండు ఉద్యోగాలను ఒకేసారి నిర్వహిస్తూ దాదాపు 50,000 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 44 లక్షల విలువైన ప్రభుత్వ నిధులను వంచించాడని గుర్తించారు. న్యూయార్క్ ప్రభుత్వ ఉద్యోగుల జీత సమాచారం వెల్లడించే సీథ్రూ-ఎన్వై వెబ్సైట్ ప్రకారం.. 2024లో అతడు రూ. కోటికి పైగా జీతం పొందినట్లు రికార్డ్ ఉంది. అయితే ప్రభుత్వానికి పని చేయాల్సిన సమయాల్లోనే ప్రైవేట్ కంపెనీ కోసం కూడా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు ఇమెయిల్ రికార్డులు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిజాయతీగా సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గోస్వామి చర్యలు ఆ ప్రజా విశ్వాసాన్ని ఉల్లంఘించడమే కాకుండా పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేసినట్టు స్పష్టంగా చూపుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Virat Kohli: క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..
ఈ ఘటనలో అక్టోబర్ 15న గోస్వామిని అధికారికంగా అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ లేకుండా విడిచిపెట్టినప్పటికీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నేరం రుజువైతే గోస్వామికి గరిష్ఠంగా 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన అరెస్టుతో అమెరికాలోనే కాకుండా భారత ఐటీ ప్రపంచంలో కూడా మళ్లీ మూన్లైటింగ్ పై పెద్ద చర్చ మొదలైంది. డబ్బు కోసం రెండు ఉద్యోగాలు చేయడం చివరికి కెరీర్ మొత్తాన్నే నాశనం చేసే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!