Moonlighting: రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్..!
Moonlighting: ఇటీవల కాలంలో రెండు ఉద్యోగాలు ఒకేసారి చేస్తూ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఓ కంపెనీలో పని చేస్తూ.. మరో కంపెనీలో రహస్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలా డబుల్ జీతం తీసుకునే వారు ఎక్కువయ్యారు. దీనినే “మూన్లైటింగ్” అని అంటారు. సాధారణంగా ఇది కంపెనీ పాలసీలను ఉల్లంఘించడం.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది తీవ్ర నేరం. “మూన్లైటింగ్” తాజాగా అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తిని పెద్ద ప్రమాదంలోకి నెట్టాయి.
READ MORE: EAM Jaishankar: ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై జైశంకర్ అసంతృప్తి
Also Read
- Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి 'ఎంజీఆర్' చరిత్రను తిరగరాస్తున్న విజయ్!
- Mamata Banerjee: "ఓట్లను దోచుకున్నారు".. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
- Vijay Emerges as King: అందరూ కింగ్మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..
- West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..
అమెరికా న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ వ్యవస్థలో కీలకమైన ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గోస్వామి 2022 నుంచే మాల్టాలోని ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ గ్లోబల్ ఫౌండ్రీస్లో రహస్యంగా కాంట్రాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు చోట్ల ఒకేసారి పని చేస్తూ, తన ప్రభుత్వ డ్యూటీ సమయాన్ని కూడా ప్రైవేట్ కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి.
READ MORE: Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
అధికారులు గోస్వామి రెండు ఉద్యోగాలను ఒకేసారి నిర్వహిస్తూ దాదాపు 50,000 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 44 లక్షల విలువైన ప్రభుత్వ నిధులను వంచించాడని గుర్తించారు. న్యూయార్క్ ప్రభుత్వ ఉద్యోగుల జీత సమాచారం వెల్లడించే సీథ్రూ-ఎన్వై వెబ్సైట్ ప్రకారం.. 2024లో అతడు రూ. కోటికి పైగా జీతం పొందినట్లు రికార్డ్ ఉంది. అయితే ప్రభుత్వానికి పని చేయాల్సిన సమయాల్లోనే ప్రైవేట్ కంపెనీ కోసం కూడా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు ఇమెయిల్ రికార్డులు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిజాయతీగా సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గోస్వామి చర్యలు ఆ ప్రజా విశ్వాసాన్ని ఉల్లంఘించడమే కాకుండా పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేసినట్టు స్పష్టంగా చూపుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Virat Kohli: క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..
ఈ ఘటనలో అక్టోబర్ 15న గోస్వామిని అధికారికంగా అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ లేకుండా విడిచిపెట్టినప్పటికీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నేరం రుజువైతే గోస్వామికి గరిష్ఠంగా 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన అరెస్టుతో అమెరికాలోనే కాకుండా భారత ఐటీ ప్రపంచంలో కూడా మళ్లీ మూన్లైటింగ్ పై పెద్ద చర్చ మొదలైంది. డబ్బు కోసం రెండు ఉద్యోగాలు చేయడం చివరికి కెరీర్ మొత్తాన్నే నాశనం చేసే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Xiaomi Civi 6 Series: షియోమి సివి 6, సివి 6 ప్రో 5G ఫోన్లు త్వరలో విడుదల.. 50MP కెమెరా, ఫ్లాగ్షిప్-గ్రేడ్ ఫీచర్లు
-
Trisha : టీవీకే విజయ్ ఇంటికి త్రిష.. సెలెబ్రేషన్స్ డబుల్
-
Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి ‘ఎంజీఆర్’ చరిత్రను తిరగరాస్తున్న విజయ్!
-
Mamata Banerjee: “ఓట్లను దోచుకున్నారు”.. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
-
Vijay Emerges as King: అందరూ కింగ్మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!