NTV Telugu Site icon

Indian Coast Guard DG Rakesh: గుండెపోటుతో ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ రాకేష్ మృతి..

Dg Rakesh

Dg Rakesh

ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. సమాచారం ప్రకారం.. రాకేష్ పాల్ అనారోగ్యంతో బాధపడుతూ రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ (RGGH) లో ఆదివారం ఉదయం చేరారు. వైద్యులు ఆయనను పరీక్షించి యాంజియో టెస్ట్ కూడా చేయించారు. కానీ ఆయనను రక్షించలేకపోయారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు.

READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్

రాకేశ్ పాల్ భౌతికకాయాన్ని ఢిల్లీకి తీసుకురానున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) డీజీ మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. సమర్థత, నిబద్ధత కలిగిన అధికారి. ఆయన నాయకత్వంలో ఐసీజీ భారతదేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో గొప్ప పురోగతిని సాధిస్తోంది. ఆయన మృతి చెందిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. చెన్నైలోని కోస్ట్ గార్డ్ యొక్క మారిటైమ్ రెస్క్యూ, కోఆర్డినేషన్ సెంటర్ యొక్క కొత్త భవనాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించారని తెలిసిందే. వేడుకను సమన్వయం చేసేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ చెన్నైకి వచ్చారు.

READ MORE:Health Tips : తిన్నవెంటనే నీళ్లు తాగుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే!

రాకేష్ పాల్ ఎవరు?
రాకేష్ పాల్ ఉత్తరప్రదేశ్ నివాసి. గతేడాది ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) 25వ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన ఇండియన్ నేవల్ అకాడమీ పూర్వ విద్యార్థి. రాకేష్ పాల్ జనవరి 1989లో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో చేరారు. ద్రోణాచార్య, ఇండియన్ నావల్ స్కూల్, కొచ్చి మరియు UKలోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ ఫైర్ కంట్రోల్ సొల్యూషన్ కోర్సు నుంచి గన్నేరీ, వెపన్ సిస్టమ్స్‌లో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందారు. రాకేశ్‌పాల్‌కు 34 ఏళ్ల అనుభవం ఉంది.