Site icon NTV Telugu

IND vs WI: ఈడెన్‌లో వెస్టిండీస్ ప్లేయర్ల గర్జన.. భారత్ ముందు భారీ లక్ష్యం!

Ind Wi1

Ind Wi1

India vs West Indies Super 8: కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య సుపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత్‌ ముందు 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.టీమిండియాకు సవాల్‌గా మారింది. ఓపెనర్లు రోస్టన్ చేజ్(40), షాయ్ హోప్(32) పరుగులతో మెరిశారు. చివర్లో జాసన్ హోల్డర్(37), రోవ్‌మన్ పావెల్(34) రెచ్చిపోయారు. బూమ్రా రెండు, హార్దిక్ పాండ్యా ఒకటి, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నారు.

READ MORE: Khamenei: “1981లో పునర్జన్మ.. 2026లో చావు”.. శనివారంతో ఖామెనీకి విడదీయలేని బంధం.. కట్‌చేస్తే అదే రోజున చావు!.

కాగా.. వెస్టిండీస్ బ్యాటింగ్‌ను షాయ్ హోప్, రోస్టన్ చేజ్‌లు ప్రారంభించారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆరంభించారు. ఎనిమిది ఓవర్ల వరకు ఔట్ కాకుండా జాగ్రత్తగా ఆడారు. తొమ్మిదవ ఓవర్లో, వరుణ్ చక్రవర్తి షాయ్ హోప్‌ వికెట్‌తో భారత్‌కు తొలి బ్రేక్ త్రూ అందించాడు. హోప్ 33 బంతుల్లో 32 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 12వ ఓవర్లో బుమ్రా హెట్మైర్‌ను అవుట్ చేశాడు. హెట్మైర్ 12 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా చేజ్ (40) పెవిలియన్‌కు పంపాడు. 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా రూథర్‌ఫోర్డ్‌(14)ను అవుట్ చేశాడు. హోల్డర్(37), రోవ్‌మన్ పావెల్(34) నాటౌట్‌గా నిలిచారు.

READ MORE: Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..

Exit mobile version