Team India Predicted Playing XI: ఇషాన్, అభిషేక్ ఓపెనింగ్ కాంబో.. ఫినిషర్గా రింకూ.. సూర్య సేన ఇదే?
Team India Predicted Playing XI: భారత్-పాకిస్థాన్ ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్ధమైంది. భారత జట్టు ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకుంది. మరోవైపు దాయాది జట్టు సైతం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ జట్టుకు సంబంధించి ఊరట నిచ్చే వార్త వచ్చింది. విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఉంటాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో తలపడే సూర్య సేన జట్టు అంచనాలను చూద్దాం. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్ మిస్ అయిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ జట్టులోకి వస్తున్నాడు. ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఇషాన్ ఈ టోర్నీలో మంచి ఫామ్లో ఉన్నాడు. దాయాది జట్టు పాక్ పై అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. అభిషేక్ రావడంతో సంజూ శాంసన్కు ఈ మ్యాచ్లో అవకాశం దక్కేలా కనిపించడం లేదు.
READ MORE: Karuppu : సూర్య ‘కరుప్పు’ సినిమా రిలీజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
మూడో స్థానంలో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయడం ఆల్మోస్ట్ ఖరారైంది. ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్పై ఎక్కువ బాధ్యత ఉంటుంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఇద్దరూ భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్నవాళ్లు. అవసరమైతే బౌలింగ్లోనూ కీలక పాత్ర పోషిస్తారు. చివర్లో రింకూ సింగ్ ఫినిషర్గా జట్టుకు బలం చేకూర్చనున్నాడు. రింకూ మ్యాచ్ చివర్లో మంచి స్కోర్ చేయగలడనే నమ్మకం ఉంది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం జట్టులో కీలకంగా మారుతాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తాడని అంచనా. కుల్దీప్ యాదవ్ సైతం ఆప్షన్గా ఉన్నా.. ప్రస్తుతం ఉన్న ఈ జట్టును మార్చాలని టీమ్ మేనేజ్మెంట్ అనుకోవడం లేదట. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ కీలక బౌలర్లుగా ఉంటారు. పవర్ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే బాధ్యత వీళ్లు తీసుకుంటారు. మొత్తానికి చూస్తే భారత్ బలమైన కాంబినేషన్తో మైదానంలోకి దిగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఓటమిని చవిచూడలేదు. అందుకే ఈ మ్యాచ్ గెలిచే జట్టే గ్రూప్ టాపర్గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అభిమానులంతా ఇప్పుడు ఈ భారీ పోరును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
READ MORE: IND vs PAK: త్రో బౌలర్ ఉస్మాన్ తారిఖ్ను ఎదుర్కొనేందుకు.. సూర్య మాస్టర్ ప్లాన్, ఇక డబిడదిబిడే!
భారత్ అంచనా జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?