India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: భారత్ – పాకిస్తాన్ మధ్య పోరు అంటే.. ఓ ఉత్కంఠ ఉంటుంది.. అది మెన్స్ క్రికెట్ అయినా.. ఉమెన్స్ క్రికెట్ అయినా.. ఇంకే క్రీడలు అయినా.. దాయాదుల పోరు అంటే రెండు దేశాలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రీడా అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు.. అయితే, మహిళల ఆసియా కప్ 2026లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 13న జరగనున్న ఫైనల్లో ఈ రెండు జట్లు ఢీకొనే అవకాశం ఉంది. అయితే అందుకు ఇరు జట్లు ముందుగా సెమీఫైనల్స్లో తమ ప్రత్యర్థులను ఓడించాల్సి ఉంటుంది. దీంతో ఆసియా కప్ ఫైనల్పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
భారత్ అద్భుత ఫామ్లో..
హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు టోర్నీలో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు థాయ్లాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ జట్లపై వరుస విజయాలు సాధించింది. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకుంది. దీంతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్కు చేరుకుంది. సెప్టెంబర్ 5న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు సత్తా చాటారు. పాకిస్తాన్ను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో భారత జట్టు ఆధిపత్యం స్పష్టమైంది.
Also Read
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
- IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
ఫైనల్లో భారత్, పాకిస్తాన్ ఎలా తలపడతాయి?
భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండటంతో సెమీఫైనల్స్లో ఈ రెండు జట్లు ఎదురుపడే అవకాశం లేదు. గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో సెమీఫైనల్ ఆడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ ఫైనల్కు చేరుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సెమీఫైనల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తన చివరి గ్రూప్ మ్యాచ్లో హాంకాంగ్ను ఓడించి సెమీఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు ఫాతిమా సనా సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు బలమైన శ్రీలంకను ఎదుర్కోనుంది.
పాకిస్తాన్కు శ్రీలంకతో అసలు పరీక్ష
శ్రీలంక కూడా టోర్నీలో ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్లో ఉంది. ఆ జట్టు తన గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్కు సెమీఫైనల్లో శ్రీలంక రూపంలో గట్టి సవాలు ఎదురుకానుంది. పాకిస్తాన్ శ్రీలంకను ఓడిస్తేనే ఫైనల్లో భారత్తో మరోసారి తలపడే అవకాశం ఉంటుంది. అందువల్ల సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మరోసారి దాయాదుల పోరుకు దిగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. భారత్ ఇప్పటికే మంచి ఫామ్లో ఉండగా, పాకిస్తాన్ మాత్రం శ్రీలంకపై కీలక సెమీఫైనల్ను గెలవాల్సి ఉంది.
తాజావార్తలు
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్లు!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!