India vs England: కటక్ వేదికగా దుల్ల కొట్టేయడానికి సిద్దమైన టీమిండియా.. కోహ్లీ తిరిగి రానున్నాడా?
- నేడు కటక్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే మ్యాచ్.
- మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
- మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవడానికి సిద్దమైన టీమిండియా.
- మరోవైపు కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్న ఇంగ్లాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల ODI సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్పూర్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్తో జరిగే ఈ వన్డే మ్యాచ్లో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. కుడి మోకాలి వాపు కారణంగా విరాట్ కోహ్లీ తొలి వన్డేకు దూరమయ్యాడు. కానీ, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. రెండవ వన్డేకు పూర్తిగా ఫిట్గా, సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మరోవైపు, ఇంగ్లాండ్తో జరిగే రెండో వన్డే మ్యాచ్లో అభిమానుల కళ్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై ఉన్నాయి. రోహిత్ శర్మ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు సాధించడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక విషయానికి వస్తే.. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. దాంతో ఆ మ్యాచ్ లో అతను 36 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తొలి మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానంలో అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, గిల్ రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. కోహ్లీ ఫిట్గా ఉన్న తర్వాత జట్టులోకి తిరిగి వస్తే, అతను కొంతకాలంగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నందున సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ప్రదర్శన తర్వాత కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ కూడా ఆడాడు. కానీ, ఆ మ్యాచ్లో కూడా అతను ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. చూడాలి మరి మొత్తానికి నేడు టీమిండియా గెలిచి సిరీస్ ని గెలుస్తుందో లేదో.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!