India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు మరోసారి ఆఫ్ఘనిస్తాన్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం, ఈ మ్యాచ్లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ప్రత్యేకత ఏమిటంటే.. మ్యాచ్లు భారత్లో జరిగినప్పటికీ, ఈ సిరీస్కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేకపోతే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇది ఓ అరుదైన ఘట్టంగా నిలవనుంది. భారత గడ్డపై భారత్తో జరిగే మ్యాచ్లకు ప్రత్యర్థి జట్టు అధికారిక ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. భద్రతా పరిస్థితుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్కు ప్రస్తుతం శాశ్వత అంతర్జాతీయ హోం గ్రౌండ్ లేకపోవడంతో, గత కొన్నేళ్లుగా భారత్లోనే తమ స్వదేశీ మ్యాచ్లను నిర్వహిస్తోంది.
ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టు గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్, లక్నో వంటి నగరాల్లో స్వదేశీ మ్యాచ్లు ఆడింది. అయితే ఇప్పటివరకు భారత్కు ఆతిథ్యం ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్లో జరిగే ఈ టీ20 సిరీస్ చారిత్రాత్మకంగా మారనుంది. టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుండగా, రెండో టెస్టు ఆగస్టు 27న ముగియనుంది. ఆ తర్వాత దాదాపు రెండు వారాల విరామంతో ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు ముందు ఈ సిరీస్ జరగడం వల్ల భారత జట్టుకు ఇది కీలక సన్నాహకంగా మారనుంది.
ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్టులో కూడా భారత్ ఒక ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఈసారి టీ20 ఫార్మాట్లో బలంగా రాణించి గత ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. మరోవైపు, టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు వైట్బాల్ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఓటమి, అనంతరం ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో కోల్పోవడం, అలాగే వన్డే సిరీస్ను 1-2తో చేజార్చుకోవడం జట్టుపై ఒత్తిడిని పెంచాయి.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది. ఆసియా క్రీడలకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, సరైన జట్టు కూర్పును ఖరారు చేసుకోవడానికి ఈ సిరీస్ మంచి అవకాశంగా భావిస్తున్నారు. మరోవైపు, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ ఫార్మాట్లో ఆడుతున్న తొలి సిరీస్ కావడం కూడా దీనికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

