Site icon NTV Telugu

IND vs PAK: అల్లాడించిన ఇషాన్.. పాక్ టార్గె్ట్ ఎంతంటే?

India

India

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ మధ్య 27వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేషించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు దారుణమైన ఆరంభం లభించింది. సల్మాన్ అఘా మొదటి ఓవర్ వేసి అభిషేక్‌ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. అభిషేక్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. కానీ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.

ఆరు ఓవర్ల తర్వాత, భారతదేశం స్కోరు 52-1. ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే తన అర్ధశతకం చేరుకున్నాడు. ఆ తర్వాత, ఇషాన్ కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే ఆడాడు. కానీ తొమ్మిదో ఓవర్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగుల వద్ద ఔటవడంతో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సామ్ అయూబ్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్య, తిలక్ వర్మ బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, 15వ ఓవర్‌లో తిలక్ వర్మ 25 పరుగులు చేసి నిష్క్రమించడంతో భారత్‌కు మూడో ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాతి బంతికే సామ్ అయూబ్ హార్దిక్‌ను అవుట్ చేశాడు. హార్దిక్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు.

Exit mobile version