FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
- FCRA సవరణ బిల్లు మా అంతర్గత వ్యవహారం..
- అమెరికాకు తేల్చి చెప్పిన భారత్..
- ఇటీవల రిపబ్లికన్ పార్టీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FCRA Bill: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ఇటీవల అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలీ మూర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. FCRA బిల్లు తమ అంతర్గత విషయమని స్పష్టం చేసింది. చట్టాల రూపకల్పన పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, విదేశీ నిధుల నియంత్రణకు అమెరికాతో పాటు అనేక దేశాల్లో కూడా ప్రత్యేక చట్టాలు ఉన్నాయనే విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.
అమెరికా వెస్ట్ వర్జీనాయాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ రీలి మూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదయమ్యాయి. ఆయన FCRA సవరణ బిల్లును విమర్శించారు. ఈ బిల్లు క్రైస్తవ సంస్థలపై ప్రత్యక్ష దాడితో సమానమని, క్రైస్తవ సంస్థలపై ప్రభావం చూపే అవకాశముందని ఆరోపించారు. చర్చిలు, మతపరమైన సేవా సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని, ఇది భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విదేశీ నిధుల నియంత్రణకు చట్టపరమైన వ్యవస్థలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ఎన్డీయే ప్రభుత్వం తీసుకురాబోతున్న FCRA సవరణ బిల్లు భారత్తో పాటు అమెరికాలో సంచలనంగా మారింది. ఈ బిల్లు ద్వారా విదేశాల నుంచి ఎన్జీవోలకు, ఇతర స్వచ్చంద సంస్థలకు వచ్చే నిధులపై జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. నిధులు ఎందుకు వచ్చాయి.? ఎక్కడ ఖర్చు చేశారు? ఏ పని కోసం వినియోగించారు? అనే వివరాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కోరుతుంది. ఒక వేళ అవకతవకలకు పాల్పడితే FCRA రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారంతో పాటు, ఆ నిధుల్ని స్వాధీనం చేసుకునే అధికారాలు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. ముఖ్యంగా, మతమార్పిడి, ఉగ్రవాదం, దేశ సార్వభౌమత్వ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజా భద్రతపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం.
Bi-Weekly Media Briefing by the Official Spokesperson (August 07, 2026)
https://t.co/rT0CbgPosI— Randhir Jaiswal (@MEAIndia) August 7, 2026
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!