Modi-Zelensky: మూడోసారి జెలెన్స్కీతో మోడీ భేటి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా?
- జెలెన్స్కీతో ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో మూడోసారి భేటీ
- భారత్ జోక్యంతో యుద్ధం ఆగుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో మూడోసారి భేటీ అయ్యారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తుండగా.. సోమవారం న్యూయార్క్లో ప్రధాని మోడీ, జెలెన్స్కీ మధ్య సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సంభాషణ సాగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయంపై తాను చాలా మంది ప్రపంచ నాయకులతో మాట్లాడానని.. యుద్ధాన్ని ముగించడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని అందరూ అంగీకరించారని మోడీ జెలెన్స్కీకి చెప్పినట్లు తెలిపారు. ఇందుకోసం తమ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయన్నారు.
READ MORE: Delhi: కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ ఇవ్వలేదని స్నేహితుడు హత్య
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
ఉక్రెయిన్ అభ్యర్థనపై జెలెన్స్కీతో భేటీ అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కోరిక మేరకు ఈ సమావేశం జరిగిందని చెప్పారు. మోడీ గత నెలలో కీవ్లో ఉక్రెయిన్ నాయకుడిని కలిశారు. దానికి కొన్ని వారాల ముందు జూలైలో, ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మాస్కోలో కలిశారు. చర్చలు, దౌత్యం ద్వారా శాంతికి మార్గాన్ని కనుగొనేందుకు ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని మిస్రీ తెలిపారు.
READ MORE:AP Govt: వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో కూడా తాను ఎప్పుడూ శాంతి, శాంతి మార్గంలో నడవడం గురించే మాట్లాడినట్లు విక్రమ్ మిస్రీ చెప్పారు. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నందున శాంతి లేకపోతే సుస్థిరమైన అభివృద్ధి ఉండదని స్పష్టమవుతోందని మిస్రీ అన్నారు. వివాదాన్ని ముగించే మార్గాన్ని కనుగొనడంపై అందరి ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నందున యుద్ధం ముగుస్తుందో లేదో కాలమే చెబుతుందన్నారు. రష్యా చమురు దిగుమతులు తన యుద్ధ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించినవి కాదన్న భారత్ వాదనను అంగీకరించారా అని అడిగిన ప్రశ్నకు.. మిస్రీ స్పందిస్తూ.. నేటి చర్చల్లో ఆ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు.
READ MORE:UP News: వీడు కొడుకేనా..? తల్లిపై అత్యాచారం, భార్యగా ఉండాలంటూ బలవంతం.. జీవిత ఖైదు విధించిన కోర్టు..
మోడీ అమెరికా పర్యటన ముగిసిన అనంతరం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశానని రాశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో నా ఉక్రెయిన్ పర్యటన ఫలితాలను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. గత నెలలో కీవ్లో తన పర్యటన, ద్వైపాక్షిక అంశాలు, రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన అన్ని విషయాలపై జరిపిన చర్చలను మోడీ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?