Modi-Zelensky: మూడోసారి జెలెన్స్కీతో మోడీ భేటి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా?
- జెలెన్స్కీతో ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో మూడోసారి భేటీ
- భారత్ జోక్యంతో యుద్ధం ఆగుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో మూడోసారి భేటీ అయ్యారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తుండగా.. సోమవారం న్యూయార్క్లో ప్రధాని మోడీ, జెలెన్స్కీ మధ్య సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సంభాషణ సాగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ విషయంపై తాను చాలా మంది ప్రపంచ నాయకులతో మాట్లాడానని.. యుద్ధాన్ని ముగించడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని అందరూ అంగీకరించారని మోడీ జెలెన్స్కీకి చెప్పినట్లు తెలిపారు. ఇందుకోసం తమ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయన్నారు.
READ MORE: Delhi: కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ ఇవ్వలేదని స్నేహితుడు హత్య
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఉక్రెయిన్ అభ్యర్థనపై జెలెన్స్కీతో భేటీ అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కోరిక మేరకు ఈ సమావేశం జరిగిందని చెప్పారు. మోడీ గత నెలలో కీవ్లో ఉక్రెయిన్ నాయకుడిని కలిశారు. దానికి కొన్ని వారాల ముందు జూలైలో, ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మాస్కోలో కలిశారు. చర్చలు, దౌత్యం ద్వారా శాంతికి మార్గాన్ని కనుగొనేందుకు ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని మిస్రీ తెలిపారు.
READ MORE:AP Govt: వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
జెలెన్స్కీతో జరిగిన సమావేశంలో కూడా తాను ఎప్పుడూ శాంతి, శాంతి మార్గంలో నడవడం గురించే మాట్లాడినట్లు విక్రమ్ మిస్రీ చెప్పారు. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నందున శాంతి లేకపోతే సుస్థిరమైన అభివృద్ధి ఉండదని స్పష్టమవుతోందని మిస్రీ అన్నారు. వివాదాన్ని ముగించే మార్గాన్ని కనుగొనడంపై అందరి ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నందున యుద్ధం ముగుస్తుందో లేదో కాలమే చెబుతుందన్నారు. రష్యా చమురు దిగుమతులు తన యుద్ధ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించినవి కాదన్న భారత్ వాదనను అంగీకరించారా అని అడిగిన ప్రశ్నకు.. మిస్రీ స్పందిస్తూ.. నేటి చర్చల్లో ఆ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు.
READ MORE:UP News: వీడు కొడుకేనా..? తల్లిపై అత్యాచారం, భార్యగా ఉండాలంటూ బలవంతం.. జీవిత ఖైదు విధించిన కోర్టు..
మోడీ అమెరికా పర్యటన ముగిసిన అనంతరం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశానని రాశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో నా ఉక్రెయిన్ పర్యటన ఫలితాలను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. గత నెలలో కీవ్లో తన పర్యటన, ద్వైపాక్షిక అంశాలు, రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన అన్ని విషయాలపై జరిపిన చర్చలను మోడీ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..