IND vs NZ: 55 ఏళ్ల నాటి రికార్డు బద్దలు.. భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!
- భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్
- న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యం
- వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు కష్టమే
- ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో మూడో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్కు ఇంకో ఒక వికెట్ మాత్రమే మిగిలుంది. ఈ క్రమంలో.. ముంబై వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ముంబైలో కూడా అలాంటిదే జరిగింది.. ఇరు జట్ల స్పిన్నర్లు భారీగానే వికెట్లు పడగొట్టారు.
Read Also: Unified Lending Interface: ఇప్పుడు సిబిల్తో సంబంధం లేకుండా.. క్షణాల్లో లోన్!
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
భారత్లో 55 ఏళ్ల రికార్డు బద్దలైంది:
ప్రస్తుతం ముంబై టెస్టులో రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా స్పిన్నర్లు మొత్తం 24 వికెట్లు పడగొట్టారు. బెంగళూరు, పుణె టెస్టుల్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం కనిపించింది. ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లు ఇప్పటి వరకు 71 వికెట్లు తీశారు. 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు ఇన్ని వికెట్లు తీయడం భారతదేశంలో ఇదే తొలిసారి. అంతకుముందు 1969లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పినర్లు 69 వికెట్లు పడగొట్టారు. తాజాగా.. 55 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు కలిసి ఈ రికార్డును బద్దలు కొట్టాయి. అంతకుముందు 1956లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు 66 వికెట్లు తీశారు. 1976లో కూడా భారత్, న్యూజిలాండ్ సిరీస్లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. స్పిన్ బౌలర్లు 65 వికెట్లు తీశారు. తాజాగా.. భారత్లో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు 70 వికెట్ల సంఖ్యను తాకడం ఇదే తొలిసారి.
వాషింగ్టన్ అగ్రస్థానంలో ఉన్నాడు:
ఈ రికార్డును బద్దలు కొట్టడంలో వాషింగ్టన్ సుందర్ ది పెద్ద పాత్ర. ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 16 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రస్తుతం నంబర్వన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 15 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 13 మంది బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. ఈ సిరీస్లో అశ్విన్ ఇప్పటి వరకు 9 వికెట్లు మాత్రమే తీశాడు.
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!