IND vs NZ: 55 ఏళ్ల నాటి రికార్డు బద్దలు.. భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!
- భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్
- న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యం
- వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు కష్టమే
- ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో మూడో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్కు ఇంకో ఒక వికెట్ మాత్రమే మిగిలుంది. ఈ క్రమంలో.. ముంబై వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ముంబైలో కూడా అలాంటిదే జరిగింది.. ఇరు జట్ల స్పిన్నర్లు భారీగానే వికెట్లు పడగొట్టారు.
Read Also: Unified Lending Interface: ఇప్పుడు సిబిల్తో సంబంధం లేకుండా.. క్షణాల్లో లోన్!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
భారత్లో 55 ఏళ్ల రికార్డు బద్దలైంది:
ప్రస్తుతం ముంబై టెస్టులో రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా స్పిన్నర్లు మొత్తం 24 వికెట్లు పడగొట్టారు. బెంగళూరు, పుణె టెస్టుల్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం కనిపించింది. ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లు ఇప్పటి వరకు 71 వికెట్లు తీశారు. 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు ఇన్ని వికెట్లు తీయడం భారతదేశంలో ఇదే తొలిసారి. అంతకుముందు 1969లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పినర్లు 69 వికెట్లు పడగొట్టారు. తాజాగా.. 55 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు కలిసి ఈ రికార్డును బద్దలు కొట్టాయి. అంతకుముందు 1956లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు 66 వికెట్లు తీశారు. 1976లో కూడా భారత్, న్యూజిలాండ్ సిరీస్లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. స్పిన్ బౌలర్లు 65 వికెట్లు తీశారు. తాజాగా.. భారత్లో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు 70 వికెట్ల సంఖ్యను తాకడం ఇదే తొలిసారి.
వాషింగ్టన్ అగ్రస్థానంలో ఉన్నాడు:
ఈ రికార్డును బద్దలు కొట్టడంలో వాషింగ్టన్ సుందర్ ది పెద్ద పాత్ర. ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 16 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రస్తుతం నంబర్వన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 15 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 13 మంది బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. ఈ సిరీస్లో అశ్విన్ ఇప్పటి వరకు 9 వికెట్లు మాత్రమే తీశాడు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?