IND vs NZ: 55 ఏళ్ల నాటి రికార్డు బద్దలు.. భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!
- భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్
- న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యం
- వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు కష్టమే
- ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో మూడో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్కు ఇంకో ఒక వికెట్ మాత్రమే మిగిలుంది. ఈ క్రమంలో.. ముంబై వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ముంబైలో కూడా అలాంటిదే జరిగింది.. ఇరు జట్ల స్పిన్నర్లు భారీగానే వికెట్లు పడగొట్టారు.
Read Also: Unified Lending Interface: ఇప్పుడు సిబిల్తో సంబంధం లేకుండా.. క్షణాల్లో లోన్!
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
భారత్లో 55 ఏళ్ల రికార్డు బద్దలైంది:
ప్రస్తుతం ముంబై టెస్టులో రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా స్పిన్నర్లు మొత్తం 24 వికెట్లు పడగొట్టారు. బెంగళూరు, పుణె టెస్టుల్లోనూ స్పిన్నర్ల ఆధిపత్యం కనిపించింది. ఈ సిరీస్లో స్పిన్ బౌలర్లు ఇప్పటి వరకు 71 వికెట్లు తీశారు. 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు ఇన్ని వికెట్లు తీయడం భారతదేశంలో ఇదే తొలిసారి. అంతకుముందు 1969లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పినర్లు 69 వికెట్లు పడగొట్టారు. తాజాగా.. 55 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు కలిసి ఈ రికార్డును బద్దలు కొట్టాయి. అంతకుముందు 1956లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు 66 వికెట్లు తీశారు. 1976లో కూడా భారత్, న్యూజిలాండ్ సిరీస్లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. స్పిన్ బౌలర్లు 65 వికెట్లు తీశారు. తాజాగా.. భారత్లో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్పిన్నర్లు 70 వికెట్ల సంఖ్యను తాకడం ఇదే తొలిసారి.
వాషింగ్టన్ అగ్రస్థానంలో ఉన్నాడు:
ఈ రికార్డును బద్దలు కొట్టడంలో వాషింగ్టన్ సుందర్ ది పెద్ద పాత్ర. ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 16 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రస్తుతం నంబర్వన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 15 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 13 మంది బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. ఈ సిరీస్లో అశ్విన్ ఇప్పటి వరకు 9 వికెట్లు మాత్రమే తీశాడు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!