Site icon NTV Telugu

T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..

Pcb

Pcb

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ నాటకాలు ముగియడం లేదు. ఇప్పటికే, బంగ్లాదేశ్‌కు సపోర్టుగా పాకిస్తాన్, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించింది. ఈ నెల 15 కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) కొత్త డ్రామాకు తెర తీసింది. భారత్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించడంపై పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి అధికారిక ఈమెయిల్ పంపలేదు. దీంతో, పాక్‌పై చర్యలు తీసుకునేందుకు వేచి చూడాల్సి వస్తోందని తెలుస్తోంది.

Read Also: The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుండి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తోంది. పాక్ ప్రభుత్వం తన జాతీయ జట్టును భారత్‌తో మ్యాచ్ ఆడొద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఐసీసీ స్పందించింది. వరల్డ్ కప్‌లో ఎంచుకున్న మ్యాచ్‌లకే ఆడటం, అంతర్జాతీయ టోర్నమెంట్ మౌలిక సుత్రాతకు విరుద్ధమని హెచ్చరించింది. పాక్ క్రికెట్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.

Exit mobile version