Site icon NTV Telugu

Maldives Controversy: మాల్దీవుల్లో సినిమా షూటింగులు వద్దు.. ప్రకటన రిలీజ్ చేసిన ఎఫ్‎డబ్ల్యూఐసీఈ

New Project (10)

New Project (10)

Maldives Controversy: మాల్దీవుల వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ పత్రికా ప్రకటన ద్వారా FWICE మాల్దీవులను బహిష్కరించాలని చిత్ర నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేసింది. ఫిల్మ్ మేకర్స్ మాల్దీవులలో షూటింగ్ చేయడానికి బదులుగా, భారతదేశంలోని అలాంటి ఇతర ప్రదేశాలలో సినిమాను చిత్రీకరించాలని, తద్వారా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరింది.

Read Also:AP Crime: 50 రూపాయలు ఇవ్వలేదని భార్య ఆత్మహత్య..!

ఫెడరేషన్ తన పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొంది.. “ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో ఉద్రిక్తత వాతావరణం ఉంది. మీడియా, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారుల సమాఖ్య FWICE ఒక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి మాల్దీవుల మంత్రుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలను FWICE ఖండిస్తోంది. అందుకే మాల్దీవులను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. FWICE మాల్దీవుల లొకేషన్లలో షూటింగ్ చేయడానికి బదులుగా, భారతదేశంలోని ఇలాంటి ప్రదేశాలలో షూటింగ్ చేసి, పర్యాటక అభివృద్ధికి సహకరించాలని దాని సభ్యులకు విజ్ఞప్తి చేస్తుంది. భవిష్యతులో మాల్దీవులలో ఎటువంటి షూటింగ్ ప్లాన్ చేయవద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలకు సూచించబడింది. మనమందరం మన ప్రధానికి, దేశానికి అండగా ఉందాం.’’ అంటూ రాసుకొచ్చింది.

Read Also:Cyber Fraud: ప్రజాపాలన దరఖాస్తులో సైబర్‌ కేటుగాళ్లు.. కాల్‌ చేసి 10 వేలు కొట్టేశారు..

అసలు వివాదం ఏంటి?
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లోని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ప్రజలు లక్షద్వీప్ గురించి ఎక్కువగా వెతకడం ప్రారంభించారు. భారతదేశంలో ఇంత అందమైన ప్రదేశం ఉన్నప్పుడు మరెక్కడికైనా వెళ్లడం ఎందుకు అని సోషల్ మీడియాలో ప్రజలు చెప్పడం ప్రారంభించారు. ఇది నచ్చని మాల్దీవుల మంత్రులు ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. లక్షద్వీప్‌ను ప్రచారం చేయడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఆ నేతలను సస్పెండ్ చేసింది.

Exit mobile version