Site icon NTV Telugu

PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు

Pm Modi

Pm Modi

ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని అన్నారు. తాము యుద్ధానికి దూరంగా ఉన్నాము.. భారత్ మొదటి రోజు నుండి పక్షపాతం కలిగి ఉంది. మా వైపు శాంతి ఉంది, మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి మేము వచ్చాము.’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడితో చెప్పారు.

Srisailam Project: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటిస్తూ.. సమస్యకు యుద్ధం, హింస పరిష్కారం కాదని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రాంతంలో సుస్థిరతను నిర్ధారించడానికి చర్చలు.. దౌత్యమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. శాంతిని నెలకొల్పే ప్రయత్నాలలో భారతదేశం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ‘యుద్ధం ప్రారంభ సమయంలో.. మీరు భారతీయ పౌరులు, విద్యార్థులను తరలించడంలో సహాయం చేసారు. ఈ సంక్షోభ సమయంలో మీరు చేసిన సహాయానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యుద్ధ సమయంలో మనం రెండు పాత్రలు పోషించామని ప్రపంచానికి బాగా తెలుసు. మొదటి పాత్ర మానవ దృక్పథం. మానవతా దృక్కోణంలో ఏది అవసరమో, భారతదేశం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.’ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Viraji: ఆహా అనిపిస్తున్న “విరాజి”

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘యుద్ధం యొక్క భయానక పరిస్థితులు బాధించాయి. యుద్ధం పిల్లలకు వినాశకరమైనది. ఈ రోజు భారతదేశం, ఉక్రెయిన్‌లకు చారిత్రాత్మకమైన రోజు’ అని అన్నారు. ‘యుద్ధం సమస్యను పరిష్కరించదు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించబడతాయి. సమయం వృధా చేయకుండా రష్యా-ఉక్రెయిన్ మాట్లాడుకోవాలి. శాంతి ప్రయత్నాల్లో భారత్ చురుకైన పాత్ర పోషిస్తుంది. యుద్ధంలో భారత్ వైఖరి ఎప్పుడూ తటస్థంగా లేదని, ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’ అని ప్రధాని మోడీ తెలిపారు. కాగా.. భారత్, ఉక్రెయిన్ నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేశాయి. మానవతా సహాయం, వ్యవసాయం, వైద్యం.. సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి.

Exit mobile version