India Mango Exports: ఈ సీజన్లో 19శాతం పెరిగిన మామిడి ఎగుమతులు.. ప్రపంచానికి మనదే నచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Mango Exports: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ మామిడి క్రేజ్ పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేయబడిన మామిడిలో 19 శాతం పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో భారతదేశం మొత్తం 47.98 మిలియన్ డాలర్ల విలువైన మామిడిని ఎగుమతి చేసింది. 2022-23 అదే కాలంలో భారతదేశం మొత్తం 40.33 మిలియన్ డాలర్ల విలువైన మామిడిని ఎగుమతి చేసింది. భారతదేశం నుండి మామిడి ఎగుమతులకు సంబంధించిన డేటాను వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ(APEDA) ఏప్రిల్ నుండి ఆగస్టు 2023 వరకు మొత్తం 27,330 మెట్రిక్ టన్నుల మామిడిని ఎగుమతి చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఐదు నెలల్లో అమెరికాకు అత్యధికంగా మామిడి ఎగుమతి అయింది. మొత్తం 2043.60 మామిడి పండ్లను అమెరికాకు ఎగుమతి చేశారు. అమెరికాకు మామిడి పండ్లను ఎగుమతి చేయడంలో భారతదేశం గొప్ప విజయాన్ని సాధించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 19 శాతం అధికంగా మామిడి ఎగుమతి జరిగింది. కాగా ఇతర దేశాల ఎగుమతులను పరిశీలిస్తే న్యూజిలాండ్కు 111 టన్నులు, ఆస్ట్రేలియాకు 58.42 టన్నులు, జపాన్కు 43 టన్నులు, దక్షిణాఫ్రికాకు 4.44 టన్నుల మామిడిపండ్లు ఎగుమతి అయ్యాయి. ఇది కాకుండా, ఇది ఇరాన్, నైజీరియా, చెక్ రిపబ్లిక్, మారిషస్లకు ఎగుమతి చేయబడింది.
Read Also:Visakhapatnam Crime: కారాగారం నుండి కోర్టుకు తరలిస్తుండగా ఖైదీ పరార్.. పోలీసులు బేజార్
Also Read
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.. APEDA సంయుక్తంగా దక్షిణ కొరియా నుండి మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి క్లియరెన్స్ కోసం ఇన్స్పెక్టర్లను ఆహ్వానించాయి. దీని కారణంగా 18.43 మెట్రిక్ టన్నుల మామిడిని దక్షిణ కొరియాకు ఎగుమతి చేసేందుకు భారత్కు అనుమతి లభించింది. 2022-23లో మామిడి ఎగుమతిలో గొప్ప విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ 2023లో భారతదేశం 41 దేశాలకు మామిడిని ఎగుమతి చేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలను పురస్కరించుకుని భారతీయ మామిడి పండ్ల ఎగుమతిని ప్రోత్సహించడానికి APEDA సియోల్ ఫుడ్ అండ్ హోటల్ షోలో కూడా పాల్గొంది. APEDA కృషి వల్ల 75 రకాల మామిడి పండ్లను బర్హీన్కు ఎగుమతి చేయగలిగారు.
Read Also:KTR Press Meet: అలా చేసి ఉంటే.. డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు: కేటీఆర్
తాజావార్తలు
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!