ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,164 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 499 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 38,660 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,44,229 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,03,08,456 కి పెరిగాయి… ఇక, కరోనాతో మృతిచెందనవారి సంఖ్య 4,14,108 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,21,665 గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 40,64,81,493 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.