కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్లో విజయం సాధించి మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించి రికార్డు స్థాయిలో 8వ టైటిల్ను గెలుచుకోవాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
Read Also: Vishwak Sen: ఇన్స్టాగ్రామ్ డీ యాక్టివ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?
భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. తమ ప్రత్యర్థి జట్లకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇప్పటివరకు జట్టుకు శుభారంభాలు అందించారు, అయితే బౌలర్లు ముఖ్యంగా దీప్తి శర్మ, రేణుకా సింగ్ ప్రదర్శన పట్ల టీమ్ మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఇప్పటివరకు దీప్తి అత్యధికంగా తొమ్మిది వికెట్లు పడగొట్టగా, రేణుక ఏడు వికెట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Read Also: Kidnap Case: బ్యాంకాక్లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
మరోవైపు.. శ్రీలంక తరఫున కెప్టెన్ చమరి అటపట్టు అద్భుత ప్రదర్శన చేస్తుంది. ఆమె ఇప్పటివరకు 243 పరుగులు చేసింది, కానీ ఆమె తప్ప, మరే ఇతర శ్రీలంక బ్యాట్స్మెన్ 100 పరుగులను చేరుకోలేదు. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవాలంటే శ్రీలంక కెప్టెన్ను నియంత్రించాల్సి ఉంటుంది. భారత్ పటిష్ట బ్యాటింగ్ లైనప్పై శ్రీలంక బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. ఆఫ్ స్పిన్నర్ కవిషా దిల్హరి (ఏడు వికెట్లు) మినహా ఇతర శ్రీలంక బౌలర్లు ఇప్పటివరకు ప్రభావం చూపలేకపోయారు.