IND vs ZIM: అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత్!
- జింబాబ్వేపై విజయం
- తొలి జట్టుగా భారత్ చరిత్ర
- రెండో జట్టుగా పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Wins in International T20Is: భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐదు టీ20 సిరీస్లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో విజయానంతరం ఈ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 230 మ్యాచ్లు ఆడిన భారత్.. 150 మ్యాచ్ల్లో గెలుపొంది అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా పాకిస్థాన్ ఉంది. పాక్ 245 మ్యాచ్ల్లో 142 విజయాలు అందుకుంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 220 మ్యాచ్ల్లో 111 విజయాలు, ఆస్ట్రేలియా 195 మ్యాచ్ల్లో 105 విజయాలు, దక్షిణాఫ్రికా 185 మ్యాచ్లో 104 విజయాలు సాదించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్మన్ గిల్ (66; 49 బంతుల్లో 7×4, 3×6), రుతురాజ్ గైక్వాడ్ (49; 28 బంతుల్లో 4×4, 3×6), యశస్వి జైస్వాల్ (36; 27 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో ముందుగా భారత్ 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఛేదనలో జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులే ఓడింది. మైయర్స్ (65 నాటౌట్, 49 బంతుల్లో 7×4, 1×6) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్ (3/15), అవేష్ ఖాన్ (2/39) జింబాబ్వేను కట్టడి చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!