IND vs WI: అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో డ్రింక్స్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ చెలరేగడంతో వెస్టిండీస్ వికెట్లు వరుసగా కోల్పోయింది.
Kaleshwaram Projcet : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
వెస్టిండీస్ బ్యాట్స్మెన్లలో షై హోప్ (26), జస్టిన్ గ్రీవ్స్ (26 నాటౌట్), రోస్టన్ చేజ్ (24) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్ క్రీజులో ఉన్నారు.
Bullet Train : తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్లకు కీలక మార్పులు
