IND Vs SA: ఒడిశా రాష్ట్రంలోని కటక్ బారాబతి స్టేడియంలో జరిగిన ఇండియా – దక్షిణాఫ్రికా తొలి T20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 101 పరుగుల తేడాతో ఇండియా సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-175/6 చేయగా, సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
READ ALSO: Y Chromosome Extinction: ప్రపంచం నుంచి పురుషులు అదృశ్యం కాబోతున్నారా?
దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా సూపర్ హిట్ ప్రదర్శన టీం ఇండియా బలమైన స్కోరును చేరుకోవడానికి విశేషంగా సహాయపడింది. పాండ్యా 28 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ తన ఇన్నింగ్స్లో నాలుగు సిక్సర్లు బాది, T20లలో 100 సిక్సర్లు పూర్తి చేశాడు. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్లను తప్పించింది.
READ ALSO: Deputy CM Pawan Kalyan: హిందూ సంప్రదాయాలపై వచ్చే తీర్పుల్లో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
