IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand Head To Head Records in ODI: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం వాంఖడే మైదానంలో న్యూజిలాండ్తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో 9 మ్యాచ్లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరిన టీమిండియా.. అదే జోరులో కివీస్ను ఓడించి ఫైనల్కు చేరాలనుకుంటోంది. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు భారత్ను ఓడించి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్ భావిస్తోంది.
భారత్, న్యూజిలాండ్ మ్యాచ్కు వేదిక అయిన వాంఖడే మైదానం బ్యాటింగ్కు అనుకూలం. నేడు జరుగబోయే సెమీస్ మ్యాచ్లోనూ పరుగుల వరద పారడం ఖాయం. వాంఖడే స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు సునాయాసంగా సిక్సర్లు, ఫోర్లు బాదగలరు. ఇదే పిచ్పై శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 357 పరుగులు చేసింది. ఆపై శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసి.. 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కష్టమవుతోంది. సాధారణంగా వాంఖడేలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువ. అయితే ఈ ప్రపంచకప్లో పేసర్లు విజృంభిస్తున్నారు. దాంతో ఈ మ్యాచ్లో టాస్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
Also Read: IND vs NZ Semi Final 2023: నేడే భారత్-న్యూజిలాండ్ తొలి సెమీస్.. ఇది ‘ప్రతీకార’ సమయం!
గతంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. టీమిండియా స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 117 వన్డే మ్యాచ్ల్లో తలపడితే.. ఇందులో భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్లలో ఫలితం రాయలేదు. ఇక ప్రపంచకప్లో ఇరు జట్లు 9 సార్లు తలపడితే.. భారత్ 5, న్యూజిలాండ్ 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు వరల్డ్కప్ సెమీ ఫైనల్లో తలపడడం ఇది వరుసగా రెండోసారి. 2019లో ఇరు జట్లు తొలిసారి సెమీ ఫైనల్లో ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ను 21 పరుగుల తేడాతో కివీస్ ఓడించింది.
తాజావార్తలు
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!