బెంగళూరు వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (134) సెంచరీ చేయగా.. టిమ్ సౌతీ (65), డెవాన్ కాన్వే (91) హాఫ్ సెంచరీలు బాదారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్స్ తీయగా.. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కివీస్ 356 పరుగుల లీడ్లో ఉంది.