Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj photo with Orry Shakes Internet: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లను పట్టుకుని ఫొటోలకు పోజులిస్తున్నాడు. అతడితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతడే ‘ఓర్హాన్ అవత్రమణి అకా ఓరీ’. ఇన్స్టాగ్రామ్లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంచలనం ఓరీ షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్తో ఓరీ ఫొటోలు దిగాడు.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ఫిబ్రవరి 5న ముగియగా.. 15 నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు ఆరంభం కానుంది. మూడో టెస్టుకు 10 రోజుల సమయం దొరకడంతో భారత ఆటగాళ్లు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ముంబైలో కనిపించాడు. బుధవారం రాత్రి ముంబైలోని బాంద్రాలో సిరాజ్ కనిపించాడు. సిరాజ్ ఓ ఈవెంట్కు వెళ్లగా.. అక్కడ సోషల్ మీడియా సంచలనం ఓరీని కలిశాడు. సిరాజ్తో ఓరీ తన ఐకానిక్ పోజ్ పెట్టి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇవి చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Also Read
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! 'క్లబ్లోకి స్వాగతం' అంటూ..
- RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
Also Read: Virat Kohli: నేను చెప్పిందంతా అబద్ధం.. విరాట్ విషయంలో డివిలియర్స్ యూటర్న్!
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టులో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ఆకట్టుకోలేదు. సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో సిరాజ్ బంతితో ఆకట్టుకోలేదు. అందులోనూ టీమిండియా ఓడిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. విశ్రాంతి ఇచ్చామని కెప్టెన్ రోహిత్ చెప్పాడు. ఇక మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్న నేపథ్యంలో సిరాజ్ ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న మూడో టెస్టు కోసం భారత ప్లేయర్స్ రాజ్కోట్లో కలవనున్నారు.
Mohammed Siraj with Orry. pic.twitter.com/141Yxt7Z3L
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 8, 2024
తాజావార్తలు
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్లోకి స్వాగతం’ అంటూ..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!