IND vs ENG: భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు బ్యాటింగ్కు వచ్చేస్తున్నాడు!
- కష్టాల్లో పడిన టీమిండియాకు శుభవార్త
- పంత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రిషబ్ పంత్
- క్రీజులోకి వస్తాడని టీమిండియా ఫాన్స్ ఆశాభావం
- భారత్.. ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant to Bat in Second Innings Despite Injury: మాంచెస్టర్లోని నాలుగో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాకు శుభవార్త. జట్టు కోసం గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగనున్నాడు. ఈ విషయాన్ని కోచ్ సితాన్షు కొటక్ పరోక్షంగా ధ్రువీకరించాడు. పంత్ తప్పకుండా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తాడని తాను అనుకుంటున్నా అని పేర్కొన్నాడు. కాలికి తీవ్ర గాయమైనా తొలి ఇన్నింగ్స్లో పంత్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు జట్టు కష్టాల్లో ఉంది కాబట్టి అతడు తప్పకుండా క్రీజులోకి వస్తాడని టీమిండియా ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కాలికి గాయమైంది. పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడగా.. బంతి ముందుగా బ్యాట్ ఎడ్జ్కు తగిలి ఆపై పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. నొప్పి భరించలేక పంత్ తన షూ తీయగా.. రక్తం కారింది. బంతి తాకిన చోట వాపు వచ్చింది. ఫిజియో వచ్చి చికిత్స చేసినా నొప్పి తగ్గకపోవడంతో వాహనంలో డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. జట్టు అవసరాల కోసం నొప్పిని భరిస్తూ రెండో రోజు మళ్లీ బ్యాటింగ్కు దిగాడు. కీపింగ్ బాధ్యతలను మాత్రం ధ్రువ్ జురెల్కు అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 669 పరుగులు చేసింది.
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
రెండో ఇన్నింగ్స్లో టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజ్లో కేఎల్ రాహుల్ (87), శుభ్మన్ గిల్ (78) ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. నేడు ఆటకు చివరి రోజు. ఈ టెస్టులో గిల్ సేన ఓడిపోకుండా ఉండాలంటే.. ఆదివారం కనీసం రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి పరుగులు చేయాల్సి ఉంది. రాహుల్, గిల్ తర్వాత ప్రధాన బ్యాటర్గా ఉంది రిషబ్ పంత్ మాత్రమే. పంత్ తర్వాత ఆల్రౌండర్లు జడేజా, ఠాకూర్, సుందర్ బ్యాటింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్లో పంత్ తప్పకుండా బ్యాటింగ్ చేస్తాడని సితాన్షు కొటక్ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం పంత్ తప్పకుండా బ్యాటింగ్ చేస్తాడని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ‘భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు వచ్చేస్తున్నాడు’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
చివరి రోజు ప్రతి బంతి కీలకమే అని, భారత బ్యాటర్లు బాగా ఆడతారని తాను భావిస్తున్నా అని సితాన్షు కొటక్ తెలిపాడు. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడమే ఇప్పుడున్న ఏకైక దారి అని పేర్కొన్నాడు. అనవసరమైన రిస్క్ షాట్లకు పోకూడదని, క్రీజులో కుదురుకున్నాక షాట్లు ఆడితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ఇకపై బ్యాటింగ్ చేయాల్సిన ఆటగాళ్లంతా నాణ్యమైన క్రికెటర్లే అని చెప్పాడు. పంత్ మానసికంగా స్ట్రాంగ్గా ఉంటాడని, తప్పకుండా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తాడని సితాన్షు ధీమా వ్యక్తం చేశాడు. పంత్ గాయంకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..