IND vs ENG: జైస్వాల్కు బయపడి.. అంపైర్కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!
- ఆసక్తికరంగా భారత్, ఇంగ్లండ్ ఐదవ టెస్ట్
- ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో భారత్
- రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన
- అంపైర్లు స్పిన్నర్కు మాత్రమే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OlliePope Lies to Umpire to Avoid Yashasvi Jaiswal: లండన్లోని ‘ది ఓవల్’ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 23 పరుగుల లీడ్ సాధించింది. టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేసి.. ఇంగ్లండ్ ముందు 350 ప్లస్ టార్గెట్ ఉంచితే గిల్ సేన గెలవడం పెద్ద కష్టమేం కాదు. రెండో రోజు జైస్వాల్, గిల్, నాయర్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. అయితే రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
రెండవ రోజు ఆట ముగియడానికి దాదాపు 15 నిమిషాల ముందు అంపైర్లు వెలుతురు తక్కువగా ఉందని చెప్పారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్, అంపైర్ కుమార్ ధర్మసేన మధ్య సంభాషణ జరిగింది. వెలుతురు తక్కువగా ఉన్న నేపథ్యంలో పోప్కు అంపైర్లు స్పిన్ బౌలింగ్ చేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అందుకు ఇంగ్లండ్ కెప్టెన్ నిరాకరించాడు. దాంతో అంపైర్లు బయిల్స్ తీసేసి.. రెండో రోజు ముగిసినట్లు ప్రకటించారు. యశస్వి జైస్వాల్ అప్పటికే ధాటిగా ఆడుతూ పరుగులు చేస్తున్నాడు. దాంతో పోప్ పేసర్తో బౌలింగ్ చేయించాలనుకున్నాడు. అంపైర్లు స్పిన్నర్కు మాత్రమే అవకాశం ఇవ్వడంతో జైస్వాల్ బ్యాటింగ్కు బయపడిన పోప్ మ్యాచ్ ముగించేశాడు.
Also Read
- Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
Also Read: IND vs ENG: కంగారుపడాల్సిన పడాల్సిన అవసరం లేదు.. ఓవల్లో మనం గెలవొచ్చు! హిస్టరీ ఇదే
ఇంగ్లండ్ జట్టులో జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ స్పిన్ బౌలింగ్ చేయగలరు. స్పిన్నర్తో బౌలింగ్ చేయిస్తే యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఆడుతాడని ఓలీ పోప్కు బాగా తెలుసు. ఆకాష్ దీప్ కూడా అప్పటికే బౌండరీ బాది ఊపుమీదున్నాడు. ఈ పరిస్థితిలో పోప్ మైదానం వదిలి వెళ్లడం మంచిదని భావించాడు. అంపైర్లు అడిగినప్పుడు తమకు స్పిన్నర్లు లేరని పోప్ చెప్పడం వీడియోలో వినిపించింది. ఆ తరువాత తాను జోక్ చేస్తున్నానని అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘జైస్వాల్కు బయపడిన పోప్’, ‘అంపైర్కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
All that happened in the lead-up to stumps… 🗣 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/rfbwSORq6g
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2025
తాజావార్తలు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
-
Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!