Ranchi Test: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIR against Khalistani terrorist Gurpatwant Singh Pannu: భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి బెదిరింపులు వచ్చాయి. నాలుగో టెస్టు మ్యాచ్ను అడ్డుకోవాలని ఆయన సీపీఐ దళాన్ని కోరారు. ఈ మేరకు పన్నూ తన సోషల్ మీడియాలో ఓ వీడియోలో అప్లోడ్ చేశాడు.
ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపుల నేపథ్యంలో ఝార్ఖండ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ జరగనున్న జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో మరింత భద్రతను కల్పించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టులు మ్యాచ్కు అడ్డంకులు సృష్టించాలని చెప్పిన పన్నూపై దుర్వా పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టినట్లు డీఎస్పీ పీకే మిశ్రా తెలిపారు. ఇటీవల కాలంలో పన్నూ పలుమార్లు భారత్ను బెదిరించాడు. గతంలో ప్రపంచకప్ ఫైనల్, ఎయిర్ ఇండియా విమానాలను, అమెరికా-కెనడా దేశాల్లోని భారతీయులను లక్ష్యంగా చేసుకొంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: Yuvraj Singh: లోక్సభ ఎన్నికలు.. బీజేపీ టికెట్పై యువరాజ్ సింగ్ పోటీ?
సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. 2007లో ఎస్ఎఫ్జేను స్థాపించగా.. 2019లో భారత్ నిషేధించింది. అప్పటినుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టిలో పన్ను ఉన్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం 2020లో పన్నును ఉగ్రవాదిగా ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 3న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అతడిపై నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇటీవల పన్ను భూమి, ఇంటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకొంది.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!