కాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 47 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. షద్మాన్ ఇస్లామ్ (50)హాఫ్ సెంచరీ చేయగా.. ముష్ఫికర్ రహీమ్ (37) రాణించాడు. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ లక్ష్య చేధనకు దిగనుంది.