Immoral Relationship : నువ్వేమో ఎంజాయ్ చేశావ్.. ఆమెను నీ భార్యతోనే చంపించేశావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Immoral Relationship : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు విచ్చిన్నమైపోతున్నాయి. అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంబంధాలకు ఆడ మగ బేధం లేకుండా మరొకరితో శారీరక సుఖం పోయి కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త వివాహేతర సంబంధంతో విసిగిపోయిన ఆ మహిళ తన భర్త ప్రియురాలిని చాలా క్రమపద్ధతిలో హత్య చేసింది. తన భర్తను వదట్లేదన్న కోపంతో ఆమెను చంపేందుకు భార్య కాంట్రాక్ట్ కిల్లర్ను నియమించింది. వారు తన భర్త, అతని ప్రియురాలిని పదే పదే కొట్టారు. ఆ తర్వాత కూడా ప్రియురాలు తన భర్తను వదల్లేదు. దీంతో ఆ మహిళ భర్త ప్రియురాలిని హతమార్చింది. మహిళ మృతదేహం లభ్యమైన తొమ్మిది రోజుల తర్వాత కుట్ర బయటపడింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు.
Read Also: Gangamma Jathara: చాటింపుతో ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర
Also Read
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర షా, మీనా దేవి ఇద్దరు దంపతులు. వీరి పెళ్లి తర్వాత చాలా కాలానికి రాజేంద్ర షాకు కుంతీదేవితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారి తీసింది. దీనిని జీర్ణించుకోలేని మీనా దేవి తన భర్తను నిలదీసింది. కాంట్రాక్ట్ ఇచ్చి మరి మనుషులను పెట్టి ఇద్దరినీ కొట్టించింది. అయినా వారు మారకపోవడంతో చంపాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే చేసి చూపింది. భర్త ప్రియురాలని హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మహిళ మృతదేహాన్ని అడవిలో పడేశారు. పోలీసులు వేగంగా దర్యాప్తు నిర్వహించారు. తొమ్మిది రోజుల్లోనే హత్య ఉదంతాన్ని బహిర్గతం చేశారు. ఈ ఘటన బాగోదర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 28న దోభచన్ అడవుల్లో చెట్టుకు కట్టివేయబడిన మహిళ మృతదేహం లభ్యమైంది.రాజేంద్ర షా ఫిర్యాదు మేరకు బాగోదర్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు గిరిదిహ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రేణు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం మహిళ హత్య వెనుక షాకింగ్ కారణాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
Read Also:Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే అపవాదులు దూరమై అనుకున్న పనులు నెరవేరుతాయి.
కేసు విచారణ కొనసాగుతుండగా, కుంతిని చంపేందుకు మీనా దేవి పథకం వేసినట్లు వెలుగులోకి వచ్చింది. కుంతిని చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్ అజయ్ కుమార్కు మీనా డబ్బు ఇచ్చింది. ఈ కేసులో మీనా, అజయ్ కుమార్ ఇద్దరినీ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆరుగురు నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఓ మైనర్ నిందితుడు కూడా ఉన్నాడు.
తాజావార్తలు
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Spider Man: భారత్లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!