NTV Telugu Site icon

Iran Israel War: హిజ్బుల్లా భూగర్భ కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. 50 మంది ఉగ్రవాదులు మృతి

Iran Israel War

Iran Israel War

Iran Israel War: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దక్షిణ లెబనాన్‌ లోని హిజ్బుల్లా లోని భూగర్భ కమాండ్ సెంటర్లపై అనేక వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో ఏకంగా 50 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో హిజ్బుల్లా సౌత్ ఫ్రంట్, రద్వాన్ ఫోర్స్‌కు చెందిన ఆరుగురు సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. సోమవారం నాడు IAF దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా లోని నాజర్ యూనిట్, బదర్ యూనిట్, అజీజ్ యూనిట్‌పై దాడి చేసింది. హిజ్బుల్లా సంస్థ సదరన్ ఫ్రంట్ దక్షిణ లెబనాన్‌లో భూగర్భ మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్‌ల పెద్ద నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీని ఉద్దేశ్యం యుద్ధ సమయంలో IDF సైనికులపై దాడి చేయడం. అంతేకాకుండా ఉత్తర ఇజ్రాయెల్‌ లోని కమ్యూనిటీలపై దాడులకు ప్లాన్ చేయడం.

Also Read: Israel’s Netanyahu: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా వారసుడిని అంతం చేశాం

ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం, వైమానిక దళం ఈ అవస్థాపనను ధ్వంసం చేయడానికి, సైట్‌లో ఉన్న ఆపరేటర్లు అలాగే కమాండర్‌లను నిర్మూలించడానికి, ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి అనేక దాడులు చేసింది. ఈ దాడులు దక్షిణ లెబనాన్‌లో IDF అధికారాన్ని అలాగే ఉత్తర ఇజ్రాయెల్‌లో భద్రతా పరిస్థితిని మార్చే దిశగా మరో అడుగుగా చెప్పవచ్చు.

Also Read: Off The Record : ఆ పార్టీలో పాట ఎందుకు ఆగిపోయింది..? గొంగడి కప్పుకుని గజ్జె కట్టేదెవరు ? డప్పు వాయించేదవరు