Food Poison: 250 మంది ట్రైనీ సైనికులకు ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో సైనికులు..

  • భీమ్‌ నగర్‌ లో ఉన్న బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసుల 250 మంది ట్రైనీ సైనికులు ఫుడ్ పాయిజన్‌
  • అస్వస్థతకు గురైన సైనికులందరికీ వీర్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స.
Food Poison

Food Poison

Food Poison: బీహార్‌ రాష్ట్రంలోని సుపాల్‌ లోని ఇండో – నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న భీమ్‌ నగర్‌ లో ఉన్న బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసుల 250 మంది ట్రైనీ సైనికులు ఫుడ్ పాయిజన్‌ కు గురయ్యారు. అస్వస్థతకు గురైన సైనికులందరికీ వీర్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసుల 12వ, 15వ బెటాలియన్‌ లలో శిక్షణ కోసం వచ్చారని సమాచారం. ఈ ట్రైనీ సైనికులందరూ ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశారని తెలుస్తోంది. సాయంత్రం నుండి అందరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభించింది. సైనికులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. రాత్రి 11 గంటల సమయానికి దాదాపు 250 మంది సైనికులు సబ్ డివిజనల్ హాస్పిటల్ వీర్పూర్ చేరుకున్నారు.

Heart Attack Video: డాక్టర్ పరీక్షిస్తుండగానే గుండెపోటుతో రోగి మృతి..

వంట చేసే స్థలంలో తమకు సల్ఫా ప్యాకెట్ దొరికిందని సైనికులు ఆరోపించారు. సైనికులకు నిరంతరం చెడు ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం లంచ్ తర్వాత భోజనం చేసిన అందరి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు.

Raksha Bandhan: అన్నా- చెల్లెలి అనుబంధం.. టాలీవుడ్ హీరోలకు వరం