Imran Khan: “రెండు ఛాన్స్లు ఇచ్చాం.. కానీ”.. పాక్ మాజీ ప్రధాని విడుదలపై బాంబు పేల్చిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడైన రాణా కొత్త విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం రెండు సార్లు “సీరియస్ డీల్” ప్రయత్నాలు జరిగాయని రాణా సనౌల్లా వెల్లడించడంతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. రాణా సనౌల్లా వివరాల ప్రకారం.. 2024 నవంబర్ 26కు ముందు జైల్లో ఉన్న మాజీ ప్రధానితో చర్చలు జరిపారు. అప్పటి ఇంటీరియర్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి అలి అమిన్ గండాపూర్ ఇమ్రాన్ను కలిసి ఈ చర్చలు జరిపారని తెలిపారు. తరువాత విదేశాల్లో ఉన్న కొంత మంది వ్యక్తులు మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ డీల్కు మొదట ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినా.. చివరికి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే దృక్పతంతో ప్రభుత్వం ఉందని.. కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపేసి తానే అధికారంలోకి రావాలనే సంకల్పంతో ఉన్నారని సనౌల్లా వెల్లడించారు.
READ MORE: AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అత్తౌల్లా తరార్ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్కు ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని.. ఏ డీల్ జరగలేదని స్పష్టం చేశారు. ఆయన ఇప్పటికే శిక్ష పడిన నేరస్థుడని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయారని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఇస్లామాబాద్లోని షిఫా ఆస్పత్రిలో కంటి చికిత్సకు అవకాశం కల్పించినట్టు సమాచారం. మరోవైపు.. ఇమ్రాన్ సోదరి నూరీన్ ఖాన్ మాత్రం జైలులో తన భయ్యాను తీవ్రంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితికి అసీం మునీర్ నాయకత్వంలోని వ్యవస్థే కారణమని విమర్శించారు. దేశంలో న్యాయబద్ధమైన పాలన లేదని ఆమె వ్యాఖ్యానించారు.
READ MORE: Iftar Recipes: రంజాన్ స్పెషల్.. ఈసారి ఇఫ్తార్ లో ఈ వంటకాలను ట్రై చేయండి.!
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!