Imran Khan: “రెండు ఛాన్స్లు ఇచ్చాం.. కానీ”.. పాక్ మాజీ ప్రధాని విడుదలపై బాంబు పేల్చిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడైన రాణా కొత్త విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం రెండు సార్లు “సీరియస్ డీల్” ప్రయత్నాలు జరిగాయని రాణా సనౌల్లా వెల్లడించడంతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. రాణా సనౌల్లా వివరాల ప్రకారం.. 2024 నవంబర్ 26కు ముందు జైల్లో ఉన్న మాజీ ప్రధానితో చర్చలు జరిపారు. అప్పటి ఇంటీరియర్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి అలి అమిన్ గండాపూర్ ఇమ్రాన్ను కలిసి ఈ చర్చలు జరిపారని తెలిపారు. తరువాత విదేశాల్లో ఉన్న కొంత మంది వ్యక్తులు మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ డీల్కు మొదట ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినా.. చివరికి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే దృక్పతంతో ప్రభుత్వం ఉందని.. కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపేసి తానే అధికారంలోకి రావాలనే సంకల్పంతో ఉన్నారని సనౌల్లా వెల్లడించారు.
READ MORE: AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అత్తౌల్లా తరార్ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్కు ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని.. ఏ డీల్ జరగలేదని స్పష్టం చేశారు. ఆయన ఇప్పటికే శిక్ష పడిన నేరస్థుడని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయారని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఇస్లామాబాద్లోని షిఫా ఆస్పత్రిలో కంటి చికిత్సకు అవకాశం కల్పించినట్టు సమాచారం. మరోవైపు.. ఇమ్రాన్ సోదరి నూరీన్ ఖాన్ మాత్రం జైలులో తన భయ్యాను తీవ్రంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితికి అసీం మునీర్ నాయకత్వంలోని వ్యవస్థే కారణమని విమర్శించారు. దేశంలో న్యాయబద్ధమైన పాలన లేదని ఆమె వ్యాఖ్యానించారు.
READ MORE: Iftar Recipes: రంజాన్ స్పెషల్.. ఈసారి ఇఫ్తార్ లో ఈ వంటకాలను ట్రై చేయండి.!
తాజావార్తలు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!