బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వేదా’. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్ గా నటిస్తుంది.తమన్నా భాటియా మరియు అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని మోనీషా అద్వానీ, మధు భోజ్వాని మరియు జాన్ అబ్రహాం సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 12 న విడుదలకు రెడీ అవుతోంది.త్వరలో ‘వేదా‘ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యం లో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం లో అద్భుతమైన యాక్టింగ్ తో జాన్ అబ్రహాం, శార్వరీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో జాన్ అబ్రహాం శార్వరికి గురువుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా స్పెషల్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే సినిమాలు, ఓటీటీల తో ఫుల్ బిజీ గా వున్న తమన్నా ఈ చిత్రంలో అమాయకురాలిగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. గత ఏడాది తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలో ఓవైపు అమాయకురాలిగా కనిపిస్తూనే హై యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది.. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు ఇప్పటికే దర్శకుడు నిఖిల్ వెల్లడించారు. సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉండబోతుందని తెలిపారు… ఈ సినిమా లో స్పెషల్ రోల్ చేయాలని నేను తమన్నాను అడిగినప్పుడు వెంటనే ఓకే చెప్పింది. ఈ సినిమా లో ఆమె పాత్ర అద్భుతంగా ఉండబోతోంది” అని వెల్లడించారు.