ICC: ఆధిపత్యం చెలాయించిన ఆ దేశ ఆటగాళ్లు.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వారికే
- ఉత్తమ ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించిన ఐసీసీ
- ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక ఆటగాళ్లు
- పురుషుల జట్టులో స్టార్ ఆల్ రౌండర్ దునిత్ వెలలాగే.. మహిళల జట్టులో హర్షిత సమరవిక్రమ ఎంపిక.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ఉత్తమ ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. ఈసారి శ్రీలంక ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. పురుషుల జట్టులో స్టార్ ఆల్ రౌండర్ దునిత్ వెలలాగే, మహిళల జట్టులో హర్షిత సమరవిక్రమ ఆగస్టు నెలలో ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఇటీవల భారత్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అలాగే.. ఐర్లాండ్ పర్యటనలో హర్షిత ఆకట్టుకుంది. ఒక నెలలో ఒకే దేశానికి చెందిన పురుష, మహిళా ఆటగాళ్లు ఇద్దరూ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్లో భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన ఈ అవార్డును తీసుకున్నారు.
Yogi Adityanath: ‘‘పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్’’ .. విభజన పాపం కాంగ్రెస్దే..
Also Read
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
- Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జాడెన్ సీల్స్ను అధిగమించి వెలలాగే ఈ అవార్డును గెలుచుకున్నాడు. భారత్పై శ్రీలంక 2-0తో సిరీస్ విజయం సాధించిన సమయంలో వెలలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. 31 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్మన్.. అజేయంగా 67, 39 రెండు ఇన్నింగ్స్లు ఆడడమే కాకుండా.. ఆ సిరీస్లో మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక పురుష ఆటగాళ్లు ఈ అవార్డును అందుకోవడం ఐదోసారి. ఇంతకు ముందు ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఈ అవార్డును గెలుచుకున్నారు.
Karnataka: పాలస్తీనా జెండాలతో హల్చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్
మరోవైపు.. మహిళల అవార్డు రేసులో హర్షిత ఐర్లాండ్కు చెందిన ఓర్లా ప్రెండర్గాస్ట్, గాబీ లూయిస్ను కిందకు నెట్టి వచ్చింది. ఐర్లాండ్ పర్యటనలో.. హర్షిత వన్డే ఇంటర్నేషనల్లో సెంచరీ చేసిన మూడవ శ్రీలంక మహిళా క్రికెటర్గా నిలిచింది. 26 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ హర్షిత రెండు టీ20 ఇంటర్నేషనల్స్లో 169.66 స్ట్రైక్ రేట్తో మొత్తం 151 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్లో 45 బంతుల్లో 86 పరుగులతో అజేయంగా నిలిచింది. అలాగే.. బెల్ఫాస్ట్లో జరిగిన మూడు వన్డేలలో 172 పరుగులు చేపింది. ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికైన రెండో శ్రీలంక క్రికెటర్ హర్షిత. ఈ ఏడాది మే, జూలైలో శ్రీలంక కెప్టెన్ చమ్రీ అటపట్టు రెండుసార్లు ఈ టైటిల్ను గెలుచుకుంది.
తాజావార్తలు
-
FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
-
Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!