Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Ropeway: భాగ్యనగర వాసులకు త్వరలోనే ఆకాశ మార్గంలో ప్రయాణించే అవకాశం అందుబాటులోకి రానుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి ప్రత్యామ్నాయంగా, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) రోప్వే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తోంది. ఇప్పటివరకు కొండ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలకు మాత్రమే పరిమితమైన రోప్వేలను ఇప్పుడు నగర ప్రజారవాణాలో భాగంగా ఉపయోగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్వే వ్యవస్థగా నిలిచిన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి మోడల్ను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి సమీప వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టారు.
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
రోప్వే వ్యవస్థలో తీగలపై ప్రయాణించే ప్రత్యేక బాక్స్ లాంటి కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్లో ఆరు నుంచి పది మంది వరకు ప్రయాణించవచ్చు. ట్రాఫిక్ను తప్పించుకుని వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా వీటిని రూపొందిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో నగర రహదారులపై ఏర్పడే భారీ ట్రాఫిక్ సమస్యలకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో చారిత్రక గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్వే ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో రోప్వే ద్వారా ప్రత్యేక అనుభూతిని కల్పించాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గాన్ని నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర పొడిగించే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు.
ఇదే కాకుండా ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా రోప్వేలను ఏర్పాటు చేసే అవకాశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మీరాలం ట్యాంక్, కొత్వాల్గూడ ఎకో పార్క్ వంటి ప్రాంతాలను కూడా రోప్వే సర్క్యూట్లో భాగం చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో అమలు చేయాలని నిర్ణయించారు. అయితే రోప్వేలు ప్రైవేట్ ఆస్తుల మీదుగా వెళ్లాల్సి వస్తే పరిహారం చెల్లించేలా ప్రస్తుత పాలసీలో మార్పులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), రక్షణ శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందే ప్రక్రియ కొనసాగుతోంది.
వారణాసిలో రోప్వే ద్వారా గంట సమయం పట్టే ప్రయాణాన్ని కేవలం 16 నిమిషాల్లో పూర్తి చేసేలా డిజైన్ చేశారు. అదే తరహాలో హైదరాబాద్లో కూడా తక్కువ దూరాలను వేగంగా చేరుకునేలా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ముఖ్యంగా 2-3 కిలోమీటర్ల దూరానికే గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్న వాహనదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది.
అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండే టికెట్ ధరలు నిర్ణయిస్తే, హైదరాబాద్ రవాణా వ్యవస్థలో రోప్వేలు విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే హైదరాబాద్ దేశంలోనే అత్యాధునిక ప్రజారవాణా సదుపాయాలు కలిగిన నగరంగా మరో గుర్తింపు పొందే అవకాశముంది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!